E-Paper
Advertisement

Telangana Minister Chambers : సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌..

Telangana Minister Chambers : సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌..
Advertisement

Telangana Minister Chambers : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో మంత్రులకు సచివాలయంలోని పలు అంతస్తుల్లో ఛాంబర్లను కేటాయించింది సర్కార్‌. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సహా 11 మంది మినిస్టర్లకు ఛాంబర్లు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కు రెండో అంతస్తులోని 10, 11, 12వ నెంబర్‌ రూమ్‌లు కేటాయించారు. 4వ అంతస్తులోని 27, 28, 29 రూమ్‌లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కి కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహకు రెండో అంతస్తులోని రూమ్‌ నెంబర్ 13, 14, 15.. ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు మూడో అంతస్థు రూమ్ నెం 10, 11, 12.. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెం 10,11,12.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఐదో అంతస్తులోని 27,28,29 రూమ్‌లు కేటాయించారు.

Advertisement

అలాగే దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖకు నాలుగో అంతస్తు రూమ్ నెం. 10, 11, 12.. పంచాయితీరాజ్ శాఖ మంత్రి దససరి అనసూయ సీతక్కకు మొదటి అంతస్తు రూమ్ 27, 28, 29.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుకు మూడో అంతస్తు రూమ్ నెం 27, 28, 29.. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నాలుగో అంతస్తు రూమ్ 13, 14, 15 కేటాయించారు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×