E-Paper
Advertisement

Praja Darbar : ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌.. బారులు తీరిన జనం..

Praja Darbar : ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌.. బారులు తీరిన జనం..
Advertisement

Praja Darbar : తెలంగాణలో ప్రజాపాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల హామీలను అమలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జనం తమ గోడును చెప్పుకునేందుకు ప్రజాభవన్‌కు భారీగా తరలివస్తున్నారు. కిలో మీటర్ల మేర క్యూ కట్టి మరీ అర్జీల రూపంలో సీఎం ముందు తమ బాధను చెప్పుకుంటున్నారు. ఇక ఇవాళ కూడా ప్రజా దర్బార్‌ నిర్వహించనుంది సర్కార్‌. కాసేపట్లో కార్యక్రమం ప్రారంభంకానుండటంతో జనం తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు.

మరోపక్క ప్రజా దర్బార్‌ను జిల్లాలకు కూడా విస్తారిస్తామని అంటున్నారు పలువురు కాంగ్రెస్‌ నేతలు. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం మరింత ప్రాధాన్యత ఇస్తామని.. ఈ మేరకు జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతి రోజే ప్రజా దర్బార్‌ను ప్రారంభించారు. వందలాదిగా జనం తరలివచ్చి కుప్పకుప్పలుగా అర్జీలను సమర్పించారు. వారు తమతో చెప్పుకున్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా అధికారులు రంగంలోకి దిగారు.

Advertisement

బీఆర్‌ఎస్‌ పాలనలో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రజలను పట్టించుకోలేదని.. కేసీఆర్‌ తీవ్ర అహంభావంతో నియంతృత్వ పాలన సాగించారన్నది విపక్షాల విమర్శలు. అందుకే తాను అధికారంలోకి వస్తే ఇందుకు భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. ఆ భరోసా మేరకు ప్రగతిభవన్‌ బ్యారికేడ్లు కూల్చి జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌గా మార్చారాయన. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మరసటి రోజు నుంచే ప్రజా దర్బాన్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో దాదాపు రోజుకి 1500ల మంది తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×