BigTV English
Advertisement

Telangana Phone Tapping Case: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్

Telangana Phone Tapping Case: కొత్త మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు, భుజంగరావుకి మధ్యంతర బెయిల్

Telangana Phone Tapping Case:  ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స నేపథ్యంలో 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇస్తూ కోర్టు తీర్పునిచ్చింది. బెయిల్ నేపథ్యంలో పలు షరతులను విధించింది న్యాయస్థానం. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది.


తెలంగాణలో సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్‌. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 గా అదనపు ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అనారోగ్యం కారణంగా ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇటు పిటిషనర్, అటు అధికారుల నుంచి వాదనలు విన్న నాంపల్లి కోర్టు , 15రోజులపాటు మధ్యంతర బెయిలిచ్చింది. బెయిల్ సమయంలో పలు షరతులను విధించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఏడాది మార్చి23న భుజంగరావుని అరెస్ట్ చేశారు పోలీసులు.


ALSO READ: సీఎం రేవంత్ ప్రతిపాదన, ఇవాళ సింఘ్వి నామినేషన్

ఈ కేసులో కీలక నిందితుడు ఏ 1 ప్రభాకర్‌రావు బయటపడేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.  ఏ6 శ్రవణ్‌కుమార్ పరారీలో ఉన్నారు. ఆయన దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కారణాలతో తాను అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని, కోలుకున్న తర్వాత వస్తానని ప్రభాకర్‌రావు న్యాయస్థానానికి తెలిపారు.

వీరిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యాయి. కేసు మొదలై చాన్నాళ్లు గడుస్తున్నా కీలక నిందితులను హాజరుపరచకపోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా. ఇంటర్ పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీకి ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×