BigTV English
Advertisement

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్‌రావు తప్పక హాజరుకావాల్సిందే!

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్‌రావు తప్పక హాజరుకావాల్సిందే!

Phone tapping case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? నాంపల్లి కోర్టు ఎందుకు కీలక నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది? వర్చువల్‌గా హాజరవుతామని చెప్పినా నేరుగా ఎందుకు రమ్మంది? మాజీ ఎస్బీఐ చీఫ్ ప్రభాకర్‌రావుకు కష్టాలు తప్పవా? న్యాయస్థానం ఆదేశాలతో కొందరు నేతలు ఎందుకు వణుకుతున్నారు? ఆయా ప్రశ్నలపై రాజకీయ పార్టీల నేతలు తలో విధంగా చర్చించుకుంటున్నారు


తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాని నిందితుడిగా భావిస్తున్న ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఏ 6 నిందితుడు శ్రవణ్‌రావును న్యాయస్థానంలో హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ వర్చువల్‌గా న్యాయస్థానం ముందు హాజరవుతారని దర్యాప్తు బృందం తెలిపింది. అందుకు ససేమిరా అంది.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా ప్రధాని నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను నేరుగా హాజరు పరచాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు అమెరికా వెళ్లనుంది దర్యాప్తు బృందం. ఇంటర్‌పోల్ ద్వారా ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను ఇండియాకు రప్పించేందు కు తెలంగాణ పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో ప్రభాకర్‌రావు ఉండే ప్రాంతాన్ని సిట్ గుర్తించినట్టు అంతర్గత సమాచారం. మరో నిందితుడు శ్రవణ్‌రావు ఆచూకీని సిట్ టీమ్ గుర్తించలేదు.


ALSO READ:  కేసీఆర్.. బిడ్డా లెక్కలు సరిపోయాయి.. నిధులకు డోకా లేదు

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారమంతా ఎస్‌బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చుట్టూ తిరుగుతోంది. ఆయన ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ టీమ్ ఓ అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. దీంతో ఆయన కోసం లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధా‌కిషన్‌రావు రిమాండ్‌లో ఉన్నారు. వీరంతా పలుమార్లు దాఖలు చేసిన బెయిల్ పిటీషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.

Tags

Related News

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Big Stories

×