E-Paper
Advertisement

Telangana Wineshops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు దుకాణాలు బంద్..

Telangana Wineshops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు దుకాణాలు బంద్..
Telangana Wineshops

Telangana Wineshops : తెలంగాణ మందుబాబులకు ఎలక్షన్ కమిషన్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల తుదిపోరుకు ఇంకా నాలుగురోజులే సమయం ఉండగా.. ఎన్నికల ప్రచారం రెండ్రోజుల్లో ముగియనుంది. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. 30న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులను తెరిచినా, అక్రమంగా మద్యం రవాణా చేసినా, అమ్మినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. అక్రమమద్య రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేలకోట్ల నగదును సీజ్ చేశారు.

Related News

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Big Stories

×