BigTV English

Telangana Wineshops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు దుకాణాలు బంద్..

Telangana Wineshops : మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. రెండ్రోజులు దుకాణాలు బంద్..
Telangana Wineshops

Telangana Wineshops : తెలంగాణ మందుబాబులకు ఎలక్షన్ కమిషన్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల తుదిపోరుకు ఇంకా నాలుగురోజులే సమయం ఉండగా.. ఎన్నికల ప్రచారం రెండ్రోజుల్లో ముగియనుంది. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. 30న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులను మూసివేయాలని ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది.


ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా వైన్ షాపులను తెరిచినా, అక్రమంగా మద్యం రవాణా చేసినా, అమ్మినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ హెచ్చరించింది. అక్రమమద్య రవాణాపై నిఘా పెట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఎన్నికల కోడ్ అమలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వేలకోట్ల నగదును సీజ్ చేశారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×