E-Paper
Advertisement

Ministers Portfolios: కేంద్ర మంత్రులుగా తెలుగువారు.. శాఖలివే..

Ministers Portfolios: కేంద్ర మంత్రులుగా తెలుగువారు.. శాఖలివే..
Advertisement

Telugu States Ministers Portfolios: కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం సాయంత్ర ప్రధాని మోదీ, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరిగింది. ఆ తరువాత మంత్రులకు శాఖలు అప్పగించారు.

మోదీ ప్రభుత్వం గత పాలనలో మంత్రులుగా ఉన్న వారికే ఆ శాఖలను కట్టబెట్టింది. కీలకమైన హోం శాఖ మంత్రిగా అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్, రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా జైశంకర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్‌‌లు ఉండనున్నారు. కాగా గత ప్రభుత్వంలో కూడా వారు ఇవే శాఖలకు అధిపతులుగా పనిచేయడం గమనార్హం.

Advertisement

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చోటు దక్కించుకోగా.. ఏపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మలు చోటు దక్కించుకున్నారు. ఇందులో కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు‌లకు కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇక బండి సంజయ్, పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు సహాయ మంత్రులు దక్కాయి.

  • కిషన్ రెడ్డి- బొగ్గు, గనుల శాఖ మంత్రి
  • బండి సంజయ్- హోం శాఖ సహాయ మంత్రి
  • రామ్మోహన్ నాయుడు- పౌరవిమానయాన శాఖ మంత్రి
  • పెమ్మసాని చంద్రశేఖర్- కమ్యూనికేషన్, గ్రామీనాభివృద్ధి సహాయ శాఖ మంత్రి
  • శ్రీనివాసవర్మ- ఉక్కు, భారీపరిశ్రమల శాఖ సహాయమంత్రి

బండి సంజయ్, కిషన్ రెడ్డి, శ్రీనివాసవర్మలు బీజేపీ తరఫున మంత్రి పదవులు దక్కించుకోగా.. రామ్మోహన్ నాయుడు,. పెమ్మసాని చంద్రశేఖర్‌లు తెలుగుదేశం పార్టీ తరఫున ఏన్డీయే కూటమిలో భాగంగా మంత్రి పదవులు ఒడిసిపట్టుకున్నారు. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండిసంజయ్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.

Advertisement

Also Read: మంత్రులకు శాఖలు కేటాయింపు.

ఇక ఏపీలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి శ్రీనివాసవర్మ లోక్ సభ బరిలో నిలిచి గెలిచారు.

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×