BigTV English

Telangana : తెలంగాణలో ఎండల నుంచి ఉపశమనం.. 3రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..

Telangana :  తెలంగాణలో ఎండల నుంచి ఉపశమనం.. 3రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్..

Telangana : తెలంగాణలో వారంరోజులుగా ఎండలు దంచేశాయి. చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా దామెరచర్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదైంది నల్లగొండలో 42.5 డిగ్రీలు నమోదైంది.


ఒకే గ్రామంలో వడదెబ్బ బారిన పడి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం కాలనీ గ్రామానికి చెందిన అచ్చె రామారావు , బేతం చిన్ని , తన్నీరు మనోహర్‌ వడదెబ్బతో మృతి చెందారు.

శనివారం నుంచి భానుడు శాంతించనున్నాడు. రాష్ట్రంలో వచ్చే రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.


తూర్పు మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ మీదుగా ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల వచ్చే మూడు రాష్ట్రంలో తూర్పు, దక్షిణ ప్రాంత జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.హైదరాబాద్‌ చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×