E-Paper
Advertisement

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు
Advertisement

Mancherial : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రివేళ సామాగ్రిని తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళాలు వేసి వాటి కీస్ తమ వద్ద పెట్టుకున్నారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు తెల్లవారుజామున కొందరు క్యాంప్ కార్యాలయం తాళాలు పగలగొట్టి అందులోని సామాన్లను మూడు, నాలుగు వాహనాలలో తరలించారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ముందుగానే క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులకు తెలియకుండా సామాన్లను తరలించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×