E-Paper
Advertisement

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు కాలేజీలకు సెలవు.. ఎందుకంటే?

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. రేపు కాలేజీలకు సెలవు.. ఎందుకంటే?
Advertisement

College Bandh: తెలంగాణలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అలర్ట్. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు మూతపడనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు కాలేజీల యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు రేపటి పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు.

రూ. 11 వేల కోట్ల బకాయిలు.. రోడ్డున పడుతున్న విద్యార్థులు!
రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభాన్ని ఈ బంద్ తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ప్రస్తుతం కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏకంగా రూ. 11,000 కోట్లకు చేరుకున్నాయని ఏబీవీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ భారీ బకాయిల వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, సరైన ఆర్థిక సాయం అందక ఏటా 2 లక్షల మంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలు!
ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కాలేజీల నిర్వహణ భారం కాలేక చేతులెత్తేస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా విద్యార్థులపై పడుతోంది. చదువు పూర్తయినా ఫీజులు రాలేదనే కారణంతో చాలా కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను హోల్డ్‌లో పెడుతున్నాయి. ఫలితంగా ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారికి, ఉద్యోగాలకు ఎంపికైన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

రేపటి బంద్ ప్రభావం ఎలా ఉండబోతోంది?
ఈ నిరసనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు.. రేపు ఉదయం నుంచే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేయించేందుకు సిద్ధమవుతున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్కూళ్లకు ఈ బంద్ వర్తిస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రేపు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు స్థానిక పరిస్థితులను బట్టి ప్రయాణ సాధనాలను, కాలేజీల సమాచారాన్ని సరిచూసుకోవడం మంచిది.

Advertisement

Also Read: రైలు దూసుకొస్తుంటే ధైర్యం చాలలేదు.. షాబాద్ ఆరుగురి హత్యల నిందితుడి ఊహించని ట్విస్ట్!

Related News

రైలు దూసుకొస్తుంటే ధైర్యం చాలలేదు.. షాబాద్ ఆరుగురి హత్యల నిందితుడి ఊహించని ట్విస్ట్!

పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపెట్టె మర్చిపోయారు.. హరీష్ రావుపై జగ్గారెడ్డి సెటైర్లు!

Addanki Dayakar: నీకేమైనా మెంటల్ ఎక్కిందా అంటూ.. హరీష్ రావుపై అద్దంకి దయాకర్ స్ట్రాంగ్ కౌంటర్!

కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కుతింటారు? విప్ వీరేశం సంచలనం

Ramchander Rao: సీఎం రేవంత్ రెడ్డికి.. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు బహిరంగ లేఖ!

Special Courts: ఖైదీలకు గుడ్ న్యూస్.. ఏళ్ల తరబడి జైల్లో ఉండాల్సిన పనిలేదు!

బీఆర్ఎస్ యాక్షన్.. కాంగ్రెస్ డైరెక్షన్! కాళేశ్వరంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×