BigTV English

TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు..

TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు..

Telangana high court news(TS news updates): బీఆర్ఎస్ ఎంపీ,హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది. ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథిరెడ్డి ఉన్నారు.


2018లో హైదరాబాద్‌ ఖానామెట్‌ వద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం సాయిసింధు ఫౌండేషన్ కు కేటాయించింది. ఆ
జీవోను సవాల్‌ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. రైట్‌ సొసైటీ, ఊర్మిళ, సురేశ్‌కుమార్ ఈ పిల్‌ వేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా మళ్లీ పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×