E-Paper
Advertisement

TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు..

TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు..

Telangana high court news(TS news updates): బీఆర్ఎస్ ఎంపీ,హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది. ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథిరెడ్డి ఉన్నారు.

2018లో హైదరాబాద్‌ ఖానామెట్‌ వద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం సాయిసింధు ఫౌండేషన్ కు కేటాయించింది. ఆ
జీవోను సవాల్‌ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. రైట్‌ సొసైటీ, ఊర్మిళ, సురేశ్‌కుమార్ ఈ పిల్‌ వేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా మళ్లీ పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×