BigTV English

E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు

E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు

E Challan: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై రాయితీ కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. టూ వీలర్స్ పై 80 శాతం, త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. కార్లు, హెవీ వెహికల్స్‌పై 50 శాతం రాయితీను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.


పెండింగ్ చలాన్లపై రాయితీలు నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకూ ఉంటాయి. వాహనదారులు ఆ లోగా చలాన్లను క్లియర్ చేసేందుకు పోలీసులు అవకాశమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది కూడా పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో.. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ చలాన్ల రుసుము వసూలైంది.

అదే తరహాలో మరోమారు రాయితీలు ప్రకటించింది పోలీస్ శాఖ. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు.. చిన్న పట్టణాలు, గ్రామశివార్లలోనూ సరైన పత్రాలు చూపనివారికి చలాన్లు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు విధిస్తున్నారు. గత నెలాఖరుకు పెంచింగ్ చలాన్ల సంఖ్య 2 కోట్లకు చేరడంతో.. మరోసారి రాయితీలను ప్రకటించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×