E-Paper
Advertisement

E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు

E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు
Advertisement

E Challan: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై రాయితీ కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. టూ వీలర్స్ పై 80 శాతం, త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. కార్లు, హెవీ వెహికల్స్‌పై 50 శాతం రాయితీను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

పెండింగ్ చలాన్లపై రాయితీలు నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకూ ఉంటాయి. వాహనదారులు ఆ లోగా చలాన్లను క్లియర్ చేసేందుకు పోలీసులు అవకాశమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది కూడా పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో.. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ చలాన్ల రుసుము వసూలైంది.

Advertisement

అదే తరహాలో మరోమారు రాయితీలు ప్రకటించింది పోలీస్ శాఖ. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు.. చిన్న పట్టణాలు, గ్రామశివార్లలోనూ సరైన పత్రాలు చూపనివారికి చలాన్లు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు విధిస్తున్నారు. గత నెలాఖరుకు పెంచింగ్ చలాన్ల సంఖ్య 2 కోట్లకు చేరడంతో.. మరోసారి రాయితీలను ప్రకటించారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×