E-Paper
Advertisement

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : గ్రామాభివృద్ధే ధ్యేయంగా, గ్రామ ప్రజలే తమ బిడ్డలుగా అనుకొని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ, బిగ్‌టీవీ ఛైర్మన్‌ విజయ్‌కాంత్‌రెడ్డి, శిల్పా దంపతులు. తమ సొంత ఊరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు విజయ్‌కాంత్‌రెడ్డి దంపతులు.

కీర్తిశేషులు తన తల్లి వెన్నం సరోజాదేవి జ్ఞాపకార్ధం గ్రామంలో సురక్షిత మంచినీటి కేంద్రం, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు విజయ్‌కాంత్‌రెడ్డి. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ప్రజలకు అంకితం చేశారు.

ఇప్పటికే గ్రామంలో దేవాలయాన్ని నిర్మించి.. ధూపదీప నైవేద్యాలను తమ సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నారు. పేదవారిని ఆదుకోవడంలో అన్నివేళలా ముందుంటున్నారు విజయకాంత్‌రెడ్డి దంపతులు. ఊరు బాగోగులు చూసుకుంటూ, గ్రామంలో ఎవ్వరికీ ఏం కావాల్సి వచ్చినా తమ సహకారం అందిస్తున్నారు. దీంతో విజయ్‌కాంత్‌ దంపతుల సేవలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.వారి కుటుంబం సుఖశాంతులతో, నిండు నూరేళ్లు ఉండాలని దీవిస్తున్నారు.

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×