E-Paper
Advertisement

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..

Water Plant Inauguration : స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు.. బిగ్ టీవీ ఛైర్మన్ దాతృత్వం..
Advertisement

Water Plant Inauguration : గ్రామాభివృద్ధే ధ్యేయంగా, గ్రామ ప్రజలే తమ బిడ్డలుగా అనుకొని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎన్‌ఆర్‌ఐ, బిగ్‌టీవీ ఛైర్మన్‌ విజయ్‌కాంత్‌రెడ్డి, శిల్పా దంపతులు. తమ సొంత ఊరికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా రెడ్యాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారు విజయ్‌కాంత్‌రెడ్డి దంపతులు.

కీర్తిశేషులు తన తల్లి వెన్నం సరోజాదేవి జ్ఞాపకార్ధం గ్రామంలో సురక్షిత మంచినీటి కేంద్రం, ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు విజయ్‌కాంత్‌రెడ్డి. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి.. ప్రజలకు అంకితం చేశారు.

Advertisement

ఇప్పటికే గ్రామంలో దేవాలయాన్ని నిర్మించి.. ధూపదీప నైవేద్యాలను తమ సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నారు. పేదవారిని ఆదుకోవడంలో అన్నివేళలా ముందుంటున్నారు విజయకాంత్‌రెడ్డి దంపతులు. ఊరు బాగోగులు చూసుకుంటూ, గ్రామంలో ఎవ్వరికీ ఏం కావాల్సి వచ్చినా తమ సహకారం అందిస్తున్నారు. దీంతో విజయ్‌కాంత్‌ దంపతుల సేవలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.వారి కుటుంబం సుఖశాంతులతో, నిండు నూరేళ్లు ఉండాలని దీవిస్తున్నారు.

Related News

తెలంగాణ అసెంబ్లీ వద్ద హైడ్రామా.. నిరసనలు, ప్లకార్డులతో.. కేటీఆర్‌కు గాయాలు- సునీత కన్నీరు

హైదరాబాద్‌లో ఘోరం.. మంటల్లో దగ్దమైన కారు, ఓ వ్యక్తి సజీవదహనం

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. తెలంగాణలో భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు అలర్ట్

కేసీఆర్ దూకుడుతో కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్!

నర్సు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మేజిస్టీరియల్ విచారణకు సీఎం ఆదేశం!

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హోం మంత్రి మన రేవంతన్నే.. పబ్ రచ్చపై ఆర్ఎస్పీ సెటైర్లు !

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు సీఎం రేవంత్ ప్రవేశపెట్టే కీలక నివేదికలివే?

Big Stories

Advertisement
×