Rain Prayers: మెదక్ జిల్లోని కౌడిపల్లి మండలం కుకుట్లపల్లిలో విద్యార్ధుల ఓ వనూత్న కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో వర్షాలు రావాలని చిన్నారులు కప్పకు, వరుణదేవుడికి అభిషేకం చేశారు. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న వేళ ఆకాశం వైపు ఆశగా చూస్తూ చిన్నారులు రైతాంగానికి అండగా నిలవాలని వాన దేవుడికి వరుణదేవుడికి మోక్కున్నారు. సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
చినుకమ్మ ఓ చినుకమ్మ పాటకు విద్యార్ధులు నృత్యం చేశారు. అది చూసిన అక్కడ వారందరు మనసులను హత్తుకునేలా చేసారు. వర్షాలు కురిసి రాష్ట్రంలో చెరువులు నిండాలని పచ్చని పంటలతో రైతన్న ముఖంలో చిరునవ్వు చిగురించాలంటూ కుకుట్లపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చిన్నారులు హృదయపూర్వకంగా వాన దేవుడికి ప్రార్థించారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలం సృష్టించింది.
Also Read: Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?
ప్రస్తుతం దేశంలో వర్షాలు ఆలస్యమవుతున్న వేళ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇలాంటి సమయంలో చిన్నారులు రైతుల కష్టాలను అర్థం చేసుకుంటూ వర్షాల కోసం ప్రార్థించడం అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెలో ప్రకృతి పరిరక్షణ, వ్యవసాయం ప్రాదాన్యత మరియు గ్రామీణ ప్రాంతాల సాంప్రదాయాలు విలువలను విద్యార్ధులకు అర్ధం అవుతాయని అక్కడి ఉపాద్యాయులు తెలిపారు.
Also read: TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!