E-Paper
Advertisement

Metro Rail Suspended: మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు, గంటల తరబడి సర్వీసులు బంద్..

Metro Rail Suspended: మెట్రో రైలు పైకెక్కి కూర్చున్న కుర్రాడు,  గంటల తరబడి సర్వీసులు బంద్..

Viral Video: కొంత మంది మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులు, లేదంటే చనిపోవాలని నిర్ణయించుకున్న వ్యక్తులు రైళ్లు మీదికి ఎక్కి హైటెన్షన్ వైర్లు పట్టుకున్న సందర్భాలు చూశాం. కారణం ఏదైనా అక్కడి కాలి బూడిదయ్యారు కూడా. తాజాగా ఓ కుర్రాడు ఇంచుమించు ఇలాంటి పనే చేశాడు. కాకపోతే, అతడు లేచిన టైమ్ బాగుండి, ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ,  మెట్రో రైలు సర్వీసులు కొద్ది గంటల పాటు నిలిచిపోయాయి.

కోచ్ ల మధ్య నిలబడి మెట్రో ప్రయాణం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ కుర్రాడు మెట్రో రైలు పైకి ఎక్కాడు. ఒక్కసారిగా ఆందోళనకు గురైన అధికారులు వెంటనే, మెట్రోకు కరెంటు సరఫరా నిలిపివేశారు. మెట్రో సేవలు నిలిచిపోయాయి. ఇంతకీ ఆ అబ్బాయి ఎందుకు పైకి ఎక్కాడు? అని అధికారులు ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వాస్తవవానికి ఆ కుర్రాడు, రెండు బోగీల మధ్య నిలబడి రైలు ప్రయాణం చేసినట్లు గుర్తించారు. భద్రతా సిబ్బంది అతడిని గుర్తించడంతో భయంతో పైకి ఎక్కాడు. అసలు ఆ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు అని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా, TSC దగ్గర రైలు ఎక్కి, అగర్గావ్‌కు ప్రయాణించాడు. సెక్రటేరియట్ స్టేషన్‌కు చేరుకునే ముందు కోచ్‌ల మధ్య నిలబడి వెళ్లాడు. అదే సమయంలోనే భద్రతా సిబ్బంది అతడిని గమనించడంతో రైలు పైకి ఎక్కినట్లు సెక్రటేరియట్ స్టేషన్ అధికారులు తెలిపారు.

తప్పిన ప్రాణాపాయం

రైలు ముందుకు కదలకుండా ఆగడం, అతడు ఎలక్ట్రికల్ లైనును తగలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అతడు విద్యుత్ వైర్లకు తగిలి ఉంటే, అక్కడికక్కడే బూడిద అయ్యేవాడని అధికారులు తెలిపారు. ఢాకా మాస్ రాపిడ్ ట్రాన్సిట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ సంస్థ విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్‌ లో బాలుడు బోగీల మధ్య వంగి ఉన్నట్లు కనిపించింది. సిబ్బంది అతడి దగ్గరికి చేరే సరికి రైలు పైకి ఎక్కినట్లు ఉంది. ఆ తర్వాత అతడిని నిచ్చెన ద్వారా భద్రతా సిబ్బంది కిందికి దింపారు.

మెట్రో అధికారులు ఏమన్నారంటే?

ఈ ఘటనపై ఢాకా మాస్ ట్రాన్సిట్ కంపెనీ లిమిటెడ్ (DMTCL) మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ ఫరూక్ అహ్మద్ కీలక విషయాలు వెల్డించారు. అతడికి కరెంటు తీగల తగలకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఒకవేళ లైన్ కు ఆని ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదన్నారు. ఈ ఘటన కారణంగా ఆదివారం రాత్రి 8:05 గంటలకు మెట్రో రైలు లైన్ 6లో రైలు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఎంతో ప్రయాణీకులు ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. ఆ అబ్బాయిని సురక్షితంగా కిందికి దింపిన తర్వాత మెట్రో సేవలు ప్రారంభించినట్లు ఫరూక్ చెప్పారు. అనంతరం బాలుడిని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

Read Also: నేవీ ఆఫీసర్ భార్యను రైల్లో నుంచి తోసి చంపిన టీసీ, ఇదీ అసలు కథ!

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×