UAE Free VISA For Kids| చాలామంది భారతీయులు అప్పుడప్పుడూ ఫ్యామిలీ ట్రిప్ కోసం దుబాయ్ వెళుతుంటారు. అయితే ఈ సారి పిల్లలతో సహా వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్యామిలీలో పిల్లలు ఉంటే వారికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా అర్హత పిల్లలకు టూరిస్ట్ వీసా ఫీజు ప్రభుత్వం మినహాయిస్తోంది. ఈ ఆఫర్ వల్ల ఫ్యామిలీ ట్రిప్ వెళ్లే వారికి ప్రయాణ ఖర్చులను కొంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.
ఈ ప్రత్యేక సౌకర్యం జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. కుటుంబ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు యూఏఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కాలంలో దరఖాస్తు చేసే అర్హత ఉన్న కుటుంబాలు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఈ వీసా ఫీజు మినహాయింపు 18 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. పిల్లలు.. తల్లిదండ్రులతో కలిసి లేదా కనీసం ఒకరితో యూఏఈకి ప్రయాణించాలి. తల్లిదండ్రుల టూరిస్ట్ వీసా దరఖాస్తుతో పాటు పిల్లల దరఖాస్తును కూడా ఒకేసారి సమర్పించాలి. అలాగే దరఖాస్తు జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలోనే చేయాలి. ఈ ఆఫర్ విదేశాల నుంచి కుటుంబంతో వచ్చే పర్యాటకులకు మాత్రమే వర్తిస్తుంది. యూఏఈలో ఇప్పటికే నివసిస్తున్న వారు తమ పిల్లలకు విజిట్ వీసా కోసం దరఖాస్తు చేస్తే ఈ మినహాయింపు వర్తించదు.
ఈ వీసా ఫీజు మినహాయింపు రెండు రకాల టూరిస్ట్ వీసాలకు వర్తిస్తుంది. ఒకటి 30 రోజుల టూరిస్ట్ వీసా, మరొకటి 60 రోజుల టూరిస్ట్ వీసా. చిన్న టూర్ అయినా, ఎక్కువ రోజుల సెలవు అయినా అర్హత ఉన్న పిల్లలు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
కాదు. ప్రభుత్వం టూరిస్ట్ వీసా ఫీజును మాత్రమే మినహాయిస్తుంది. కానీ ట్రావెల్ ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఛార్జీలు, ట్రావెల్ ఏజెన్సీ సేవా రుసుములు మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ ఖర్చులు ఒక్కో పిల్లవాడికి 80 దిర్హమ్లు (దుబాయ్ కరెన్సీ) నుంచి 170 దిర్హమ్లు వరకు ఉండవచ్చు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,000 నుంచి రూ.4,500 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు సుమారు 120 దిర్హమ్లు వరకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తాయి.
సాధారణంగా ఒక పిల్లవాడి 30 రోజుల టూరిస్ట్ వీసా ఫీజు 250 దిర్హమ్లు నుంచి 350 దిర్హమ్లు వరకు ఉంటుంది. ఈ ప్రభుత్వ ఫీజు పూర్తిగా మినహాయించబడుతుంది. ఇద్దరు పిల్లలతో ప్రయాణించే కుటుంబం 500 దిర్హమ్లు నుంచి 700 దిర్హమ్లు వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఛార్జీలు మాత్రం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముందుగానే మొత్తం ఖర్చుల వివరాలను ట్రావెల్ ఏజెన్సీ నుంచి తెలుసుకోవడం మంచిది.
Also Read: ఫ్రీ ఫ్రీ.. దుబాయ్లో హోటల్ స్టే, డిన్నర్, ట్రావెల్ అన్నీ ఉచితం.. ప్రభుత్వం కొత్త ఆఫర్
పిల్లల పాస్పోర్ట్ గడువు చెల్లుబాటులో ఉందో లేదో ముందుగా చూసుకోవాలి. తల్లిదండ్రులు, పిల్లల వీసా దరఖాస్తులను ఒకేసారి సమర్పించాలి. ట్రావెల్ ఏజెన్సీ ఈ వేసవి వీసా ఫీజు మినహాయింపును వర్తింపజేసిందో లేదో నిర్ధారించుకోవాలి. అలాగే ప్రభుత్వ ఫీజు, ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఛార్జీల వివరాలను విడిగా తెలుసుకోవాలి.
యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఈ టూరిస్ట్ వీసా ఫీజు మినహాయింపు కుటుంబాలకు మంచి అవకాశం. ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణించే వారు వీసా ఖర్చులో గణనీయమైన మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే కండీషన్స్ తప్పనిసరిగా పాటించాలి. దరఖాస్తు చేసే ముందు అన్ని వివరాలను సరిచూసుకుని అధికారిక నిబంధనల ప్రకారం అప్లై చేస్తే ఈ ప్రత్యేక ఆఫర్ను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.
Also Read: ఒక్క విమానం కూడా రాని ఎయిర్పోర్ట్కు నెంబర్ 1 ర్యాంక్? అసలు విషయం ఇదీ..