E-Paper
Advertisement

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. అరగంట ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. అరగంట ముందు కూడా బోర్డింగ్ స్టేషన్ మార్చుకోవచ్చు!
Advertisement

IRCTC New Facility: భారతీయ రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రయాణికులు రైలు బయలుదేరే సమయానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా తమ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవకాశం కల్పించింది. ఈ మార్పు వల్ల చివరి నిమిషంలో ప్లాన్ మారినా, ప్రయాణాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమలు

ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. తాజాగా దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం,  చివరి రిజర్వేషన్ చార్ట్ సిద్ధమయ్యే వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు. అంటే, రైలు బయలుదేరే సమయానికి 30 నిమిషాల ముందు కూడా ఈ మార్పు చేసుకోవచ్చు. ఈ నిబంధన ముఖ్యంగా పెద్ద నగరాల్లో ఉన్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఒకే నగరంలో పలు రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇలా మార్చుకోవడం వల్ల ఎక్కడైనా రైలు ఎక్కే అవకాశం ఉంది.

ప్రయాణీకులకు అనుకూలమైన స్టేషన్ ఎంపిక

Advertisement

ఈ సౌకర్యం వల్ల ప్రయాణికులు తమకు అనుకూలమైన స్టేషన్‌ను చివరి నిమిషంలో కూడా ఎంచుకోవచ్చు.  ఒక వ్యక్తి మొదట ఒక స్టేషన్ నుండి ఎక్కాలని ప్లాన్ చేసి, తరువాత మరో స్టేషన్ దగ్గరగా అనిపిస్తే, వెంటనే బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకుని అక్కడి నుంచే రైలు ఎక్కవచ్చు. ఇంతకుముందు ఈ మార్పు చేయడానికి రిజర్వేషన్ చార్ట్ తయారు కాకముందే చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితి కొంచెం సడలించబడింది.

రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

తాజాగా బోర్డింగ్ స్టేషన్ మార్పుకు సంబంధించి రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులు మొదట ఎంచుకున్న స్టేషన్‌ లో రైలు ఎక్కలేకపోయినా, తర్వాతి స్టేషన్ నుంచి ఎక్కే అవకాశం ఉండడం వల్ల వారి సీటు కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది. కానీ, ఇప్పుడు ప్రయాణికులకు ఒక పెద్ద ఉపశమనం అని చెప్పాలి.

ఈ సౌకర్యం వారికి మాత్రమే!

Advertisement

అయితే, ఈ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండదు. ఇది కేవలం కన్ఫర్మ్ అయిన టిక్కెట్లు, ఆర్‌ఏసీ (RAC) టిక్కెట్లు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్నవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించలేరు. అలాగే, బోర్డింగ్ పాయింట్‌ ను ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది.

బోర్డింగ్ స్టేషన్ ఎలా మార్చుకోవాలంటే?

బోర్డింగ్ స్టేషన్ ను ఆన్‌ లైన్‌ లో ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా IRCTC వెబ్‌ సైట్ లేదంటే యాప్‌ లో లాగిన్ కావాలి. తర్వాత ‘My Account’ లోకి వెళ్లి ‘My Transactions’ ద్వారా ‘Booked Ticket History’ ని ఓపెన్ చేయాలి. అక్కడ మీ టికెట్‌ను ఎంచుకుని “Change Boarding Point” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తరువాత మీకు కావాల్సిన స్టేషన్‌ను ఎంపిక చేసి నిర్ధారిస్తే సరిపోతుంది. వెంటనే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కౌంటర్ టిక్కెట్లు ఉన్నవారు సమీప రైల్వే స్టేషన్‌లోని PRS కౌంటర్‌కి వెళ్లి ఈ మార్పు చేయించుకోవచ్చు.

Read Also: విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×