Indian Railways: శీతాకాలం అంటేనే ప్రకృతి రమణీయతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉత్తరాదిని మంచు దుప్పటికే కప్పేస్తుండగా, సౌత్ లో పొగమంచు నృత్యం చేస్తుంటుంది. ప్రకృతి అందం అంతా వింటర్ లోనే కనువిందు చేస్తుంది. ఈ సమయంలో రైలు ప్రయాణం చేస్తుంటే చెప్పలేని అనుభూతి కలుగుతుంది. కిటికీ దగ్గర కూర్చొని చూస్తుంటే మంచుతో కప్పబడిన పర్వతాల నుంచి పొగ మంచు లోయల వరకు ఆహా అనిపిస్తాయి. దేశంలో శీతాకాలంలో చేయాల్సిన బెస్ట్ ట్రైన్ జర్నీస్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్
శీతాకాలపు అందాలను అద్భుతంగా అందించే రైలు ప్రయాణం ఏదైనా ఉందంటే.. అది కల్కా-సిమ్లా టాయ్ జర్నీ మాత్రమే. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ప్రయాణంలో 102 సొరంగాలు, 864 వంతెనలు, పైన్ అడవులు, మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల కనువిందు చేస్తాయి. శీతాకాలంలో ఈ ట్రైన్ జర్నీ చేస్తుంటే మేఘాల్లో తేలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. సూర్యకాంతిలో మెరిసే మంచుగడ్డలు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
⦿డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
శీతాకాలంలో ప్రయాణించాల్సిన మరో రైలు ప్రయాణం డార్జిలింగ్ హిమాలయన్ జర్నీ. న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు కొనసాగే ఈ ప్రయణం ప్రకృతి ప్రేమికులకు మర్చిపోలేను అనుభవాన్ని అందిస్తుంది. శీతాకాలంలో, పచ్చని తేయాకు తోటలు పొగమంచుతో కప్పబడి మరింత రమణీయంగా కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు మరింత అందాన్ని కలిగిస్తాయి.
⦿కాంగ్రా వ్యాలీ రైల్వే
ఈ ట్రైన్ జర్నీ పఠాన్ కోట్ నుంచి ప్రారంభమై అత్యద్భుతమైన కాంగ్రా వ్యాలీ గుండా కొనసాగుతుంది. శీతాకాలంలో ధౌలాధర్ ప్రాంతాలు మంచు దుప్పటిని ధరించి మరింతి ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తుంది. లోయలు, నదులు, హిల్ స్టేషన్లు మరింత అందాన్ని కలిగిస్తాయి.
⦿జమ్మూ-బారాముల్లా రైలు
శీతాకాలంలో కాశ్మీర్ మంచులో మునిగిపోతుంది. జమ్మూ-బారాముల్లా రైలు ప్రయాణం మిమ్మల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. 356 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రయాణంలో.. మంచుతో నిండిన నదుల నుంచి మొదలుకొని, పర్వతాల వరకు కాశ్మీర్ లోయ అందాలను కళ్లకు కడుతుంది. బనిహాల్, కాజిగుండ్ పట్టణాల గురించి సాగే ఈ ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుంది.
⦿నీలగిరి పర్వత రైల్వే
ఇక సౌత్ లో మెట్టుపాళ్యం నుంచి ఈటీ వరకు కొనసాగే ఈ ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రయాణంగా గుర్తించిన ఈ రైల్వే జర్నీ.. పచ్చని టీ తోటలు, దట్టమైన అడవులు మరింత అందంగా కనిపిస్తాయి. ఈ రైలు వింటేజ్ స్టీమ్ ఇంజిన్, పాతకాలపు క్యారేజీలు మరింత స్పెషల్ గా అనిపిస్తాయి.
⦿మాథెరన్ హిల్ రైల్వే
ముంబైలో ఉన్నట్లైతే కచ్చితంగా మాథెరన్ హిల్ రైల్వే జర్నీ చేయాల్సిందే. శీతాకాలంలో, మాథెరన్ పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మానసికంగా రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఇది చక్కటి మార్గం. ఈ రైలు నెమ్మదిగా ముందుకు కదులుతూ పాతకాలపు వైబ్స్ అందిస్తుంది. పశ్చిమ కనుమల్లో ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తుంది.
⦿డెక్కన్ ఒడిస్సీ
డెక్కన్ ఒడిస్సీ మహారాష్ట్రలో గొప్ప పర్యటన అనుభూతిని కలిగిస్తుంది. గోవా, అజంతా, ఎల్లోరాలో స్టాప్ లతో ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో గోవా బీచ్లు, ఎల్లోరా గుహలు మరింతగా ఆకట్టుకుంటాయి.
Read Also: దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు ప్రయాణం ఇదే.. వేగంలో వందే భారత్ కు ఏమాత్రం తీసిపోదు!