Vaishno Devi Tour Package: శ్రీమాతా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలి వెళ్తారు. అమ్మవారి కనులారా చూసి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీమాతా వైష్ణో దేవి అమ్మవారిని ఏ కోరిక కోరుకున్నా, కచ్చితంగా నెరవేర్చుతుందని భక్తులు విశ్వసిస్తారు. కొలిచిన భక్తులకు కొంగు బంగారమై నిలిచే అమ్మవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఒకవేళ మీరూ అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే, IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ప్యాకేజీ ధర ఎంత? టూర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏ ప్రదేశాలను దర్శించుకోవచ్చు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
IRCTC అందుబాటులోకి తీసుకొచ్చిన మాతా వైష్ణోదేవి టూర్ లో భాగంగా ప్రయాణించే టూరిస్టులకు భోజనంతో పాటు వసతి సౌకర్యాన్ని కలిగిస్తుంది.
వైష్ణో దేవి టూర్ ట్రిప్ 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. ఈ యాత్ర వారణాసి జంక్షన్ లో మొదలై, జమ్మూ తావి వరకు కొనసాగుతుంది. ప్యాకేజీ ధర రూ. 6,590 నుంచి మొదలుకొని రూ.16,460 ఉంటుంది. ఆయా వసతులను బట్టి ప్యాకేజీ ధర మారుతుంది.
⦿ తొలి రోజు రైలు నెం. 12237లో 12: 40 గంటలకు వారణాసి జంక్షన్ నుంచి బయల్దేరుతుంది.
⦿ రెండో రోజు జమ్మూ తావికి ఉదయం 10: 50 గంటలకు చేరుకుంటారు. షేరింగ్ పద్దతిలో AC వాహనంలో కత్రాలోని హోల్ కు తీసుకెళ్తారు.
⦿ 3వ రోజు అల్పాహారం తర్వాత మాతా వైష్ణో దేవి దర్శనం కోసం తీసుకెళ్తారు. సాయంత్రం మళ్లీ హోటల్ కు తీసుకొస్తారు.
⦿ 4వ రోజు ఉదయం 9.30 గంటలకు అల్పాహారం తర్వాత చెక్ అవుట్ చేసి జమ్మూ తావి నుండి మధ్యాహ్నం 1.45 గంటలకు రైలు నంబర్ 12238లో జమ్మూకు చేరుకుంటారు. రైలులో పగలు, రాత్రి ప్రయాణం కొనసాగుతుంది.
⦿ 5వ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు వారణాసికి చేరుకుంటారు.
Read Also: ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!
ఈ టూర్ ప్యాకేజీలో, మీరు జమ్మూలోని మాతా వైష్ణో దేవిని మాత్రమే సందర్శించగలరు. ఈ IRCTC టూర్ ప్యాకేజీ గురించి మరింత తెలుసుకోవడానికి, మీరు https://www.irctctourism.com/pacakage_description?packageCode=NLR022ని సందర్శించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
Read Also: తొలుత ఒకటి, తర్వాత ఎనిమిది.. వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!