E-Paper
Advertisement

ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ ఎక్కడకి వస్తుందో వాట్సాప్‌లో చూసుకోండి.. జజీరా కొత్త ప్లాన్!

ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ ఎక్కడకి వస్తుందో వాట్సాప్‌లో చూసుకోండి.. జజీరా కొత్త ప్లాన్!
Advertisement

Jazeera Airways: కువైట్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘జజీరా ఎయిర్‌వేస్’ మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమాన సర్వీసును నిర్వహించింది. కువైట్-మంగళూరు-కువైట్ సెక్టార్‌లో భాగంగా దమ్మమ్ మీదుగా ఈ ప్రయాణం సాగింది. గురువారం సాయంత్రం 4:25 గంటలకు దమ్మమ్ నుండి వచ్చిన జజీరా విమానం (J9 3417) మంగళూరులో ల్యాండ్ అయ్యింది. ఇందులో 11 మంది చిన్నారులతో సహా మొత్తం 181 మంది ప్రయాణికులు ఉన్నారు. కెప్టెన్ జిమ్మీ మూసా నేతృత్వంలోని నలుగురు సిబ్బంది ఈ విమానంలో సేవలందించారు.

జజీరా ఎయిర్‌వేస్ కొత్త ఏర్పాట్లు

Advertisement

తిరిగి ప్రయాణంలో (J9 3418) అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు 151 మంది ప్రయాణికులతో ఈ విమానం మంగళూరు నుంచి బయలుదేరింది. కువైట్ , దమ్మమ్ మధ్య ప్రయాణికుల సౌకర్యార్థం ఎయిర్‌లైన్స్ ప్రత్యేకంగా రోడ్డు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గతంలో కోవిడ్-19 సమయంలో కూడా జజీరా ఎయిర్‌వేస్ మంగళూరుకు తన సేవలను అందించిన సంగతి తెలిసిందే.

ప్రయాణికుల కోసం జాజ్‌లింక్

Advertisement

ప్రయాణికుల సమాచారం కోసం ‘జాజ్‌లింక్’ (JazLink)
కేవలం విమాన సర్వీసులే కాకుండా, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడానికి జజీరా ఎయిర్‌వేస్ టెక్నాలజీ పరంగా కీలక అడుగు వేసింది. ఇందుకోసం భారతదేశపు అగ్రగామి ‘కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆటోమేషన్’ కంపెనీతో జతకట్టి ‘జాజ్‌లింక్’ (JazLink) అనే ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

ఈ కొత్త టెక్నాలజీతో కలిగే ప్రయోజనాలు

ఫ్లైట్ స్టేటస్, లగేజీ వివరాలు, రీ-బుకింగ్ లింక్స్ వంటి సమాచారాన్ని ప్రయాణికులు తమ వాట్సాప్ ద్వారా నేరుగా పొందవచ్చు. వివిధ భాషల్లో సమాచారాన్ని అందించడం ద్వారా ప్రయాణికులకు భాషా ఇబ్బందులు లేకుండా చేస్తుంది. గల్ఫ్ దేశాలలోనే (GCC) మొదటిసారిగా విమానం దిగగానే మీ లగేజీ ఏ బెల్టు పైకి వస్తుందో ఆటోమేటెడ్‌గా మెసేజ్ పంపే సౌకర్యాన్ని జజీరా ప్రవేశపెట్టింది. దీనివల్ల విమానాశ్రయాల్లో ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది.

డూప్లికేట్ మెసేజ్‌లకు గుడ్‌బై

ఫోనాన్ (Phonon) వారి ’22North’ నో-కోడ్ డిజైనర్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా నోటిఫికేషన్ల సామర్థ్యం 73 శాతం పెరిగినట్లు సంస్థ వెల్లడించింది. దీనివల్ల ప్రయాణికులకు అనవసరమైన డూప్లికేట్ మెసేజ్‌లు రాకుండా, ఖచ్చితమైన , అవసరమైన సమాచారం మాత్రమే అందుతుంది. తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని అందించే జజీరా ఎయిర్‌వేస్, ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తోంది.

Also Read: మళ్లీ కనిపిస్తామో లేదో తెలీదు.. విమానం ఎక్కాలంటే వణికిపోతున్న పైలట్లు

Related News

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

Big Stories

Advertisement
×