E-Paper
Advertisement

చెన్నై ఎయిర్‌పోర్టు.. విమానం నుంచి జంప్ చేసిన ప్రయాణికుడు, అలర్టయిన పైలట్, రంగంలోకి అధికారులు

చెన్నై ఎయిర్‌పోర్టు.. విమానం నుంచి జంప్ చేసిన ప్రయాణికుడు, అలర్టయిన పైలట్, రంగంలోకి అధికారులు
Advertisement

Chennai Airport: చెన్నై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం తోటి ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రయాణికుడు దూకాడు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

చెన్నై ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున ఊహించని ఘటన

Advertisement

ఆదివారం తెల్లవారుజామున షార్జా-చెన్నైకి ఎయిర్ అరేబియా వచ్చింది. విమానం ల్యాండైన తర్వాత రన్‌వేపై కదులుతుండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచి విమానం నుండి దూకేశాడు. ఈ సన్నివేశాన్ని చూసి తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఘటన సమయంలో విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ప్రధాన రన్‌వేను దాటి టాక్సీవేపై నెమ్మదిగా కదులుతోంది. ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకు ఈ సంఘటన జరిగింది. ఊహించని పరిణామంతో క్యాబిన్‌లో సిబ్బంది, తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

విమానం రన్ వేపై కదులుతుండగా ఎమర్జెన్సీ గేటు నుంచి దూకిన ప్రయాణికుడు

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, విమానానికి నష్టం జరగలేదని జాతీయ మీడియా పేర్కొంది. ఈ సంఘటన ప్రధాన రన్‌వేపై జరగలేదని ఎయిర్‌పోర్టుకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానంలో అస్వస్థతకు గురై ఉండవచ్చని, రెండుసార్లు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అతడు ప్రభావితం కావచ్చని అంటున్నారు.

పైలట్ వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశాడు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది.

ALSO READ: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

ముందుజాగ్రత్త చర్యగా ప్రధాన రన్‌వేను ఉదయం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు మూసివేశారు. అంతర్జాతీయ విమానాలను మరొక రన్‌వే వైకి మళ్లించారు. ఆ ప్రయాణికుడు తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందినవాడని మీడియా నివేదికలు చెబుతున్నాయి. భద్రతా ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×