E-Paper
Advertisement

చెన్నై ఎయిర్‌పోర్టు.. విమానం నుంచి జంప్ చేసిన ప్రయాణికుడు, అలర్టయిన పైలట్, రంగంలోకి అధికారులు

చెన్నై ఎయిర్‌పోర్టు.. విమానం నుంచి జంప్ చేసిన ప్రయాణికుడు, అలర్టయిన పైలట్, రంగంలోకి అధికారులు

Chennai Airport: చెన్నై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచి కిందకు దూకడం తోటి ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ప్రయాణికుడు దూకాడు. ఇంకాస్త డీటేల్స్ లోకి వెళ్తే..

చెన్నై ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున ఊహించని ఘటన

ఆదివారం తెల్లవారుజామున షార్జా-చెన్నైకి ఎయిర్ అరేబియా వచ్చింది. విమానం ల్యాండైన తర్వాత రన్‌వేపై కదులుతుండగానే ఓ ప్రయాణికుడు అత్యవసర ద్వారం తెరిచి విమానం నుండి దూకేశాడు. ఈ సన్నివేశాన్ని చూసి తోటి ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. ఘటన సమయంలో విమానంలో 231 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ప్రధాన రన్‌వేను దాటి టాక్సీవేపై నెమ్మదిగా కదులుతోంది. ల్యాండ్ అయిన కొద్ది క్షణాలకు ఈ సంఘటన జరిగింది. ఊహించని పరిణామంతో క్యాబిన్‌లో సిబ్బంది, తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.

విమానం రన్ వేపై కదులుతుండగా ఎమర్జెన్సీ గేటు నుంచి దూకిన ప్రయాణికుడు

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, విమానానికి నష్టం జరగలేదని జాతీయ మీడియా పేర్కొంది. ఈ సంఘటన ప్రధాన రన్‌వేపై జరగలేదని ఎయిర్‌పోర్టుకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఆ ప్రయాణికుడు విమానంలో అస్వస్థతకు గురై ఉండవచ్చని, రెండుసార్లు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా అతడు ప్రభావితం కావచ్చని అంటున్నారు.

పైలట్ వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశాడు. వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన నేపథ్యంలో విమానాశ్రయంలో కార్యకలాపాలకు స్వల్ప అంతరాయం కలిగింది.

ALSO READ: మిస్సైన 37 ఏళ్లకు తిరిగొచ్చిన విమానం, ఇప్పటికీ అంతు చిక్కని పాన్ ఆమ్ 914 ఫ్లైట్ మిస్టరీ!

ముందుజాగ్రత్త చర్యగా ప్రధాన రన్‌వేను ఉదయం మూడున్నర నుంచి నాలుగున్నర గంటల వరకు మూసివేశారు. అంతర్జాతీయ విమానాలను మరొక రన్‌వే వైకి మళ్లించారు. ఆ ప్రయాణికుడు తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాకు చెందినవాడని మీడియా నివేదికలు చెబుతున్నాయి. భద్రతా ఉల్లంఘనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×