E-Paper
Advertisement

ఢిల్లీలో చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఫైర్!

ఢిల్లీలో చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఫైర్!
Advertisement

Konda Vishweshwar Reddy: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా నిధుల కోసం కాంగ్రెస్ నేతలు ‘చిప్ప చేతిలో పట్టుకుని’ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారంటూ ఆయన చేసిన ఘాటు విమర్శలు చర్చకు దారితీశాయి. కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడగడం వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రం ఇచ్చే నిధులతోనే బండి లాగిస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు అందుతున్న ప్రయోజనాల వెనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నారు. ‘తెలంగాణలో రైతు ఈరోజు బ్రతుకుతున్నాడంటే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నుంచి అత్యధికంగా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని, తద్వారా రైతులకు భరోసా కల్పిస్తోందని గుర్తుచేశారు.

Advertisement

ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారని విమర్శించే వారికి ఈ లెక్కలే సమాధానమని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం రాజకీయ విమర్శలు చేయడం మానేసి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం పాత్రను విస్మరించి మాట్లాడటం సరికాదన్నారు. మొత్తానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్, ఇటు బిజెపి శ్రేణుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి.

Also Read: రాయచోటిలో రూ. 6 కోట్లతో కృష్ణ మందిరం.. భూమి పూజ చేసిన మంత్రులు

Advertisement

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×