E-Paper
Advertisement

ఢిల్లీలో చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఫైర్!

ఢిల్లీలో చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఫైర్!
Advertisement

Konda Vishweshwar Reddy: చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా నిధుల కోసం కాంగ్రెస్ నేతలు ‘చిప్ప చేతిలో పట్టుకుని’ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారంటూ ఆయన చేసిన ఘాటు విమర్శలు చర్చకు దారితీశాయి. కేంద్ర మంత్రులను కలిసి నిధులు అడగడం వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రం ఇచ్చే నిధులతోనే బండి లాగిస్తోందని విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు అందుతున్న ప్రయోజనాల వెనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్నారు. ‘తెలంగాణలో రైతు ఈరోజు బ్రతుకుతున్నాడంటే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ నుంచి అత్యధికంగా ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని, తద్వారా రైతులకు భరోసా కల్పిస్తోందని గుర్తుచేశారు.

Advertisement

ప్రధాని మోడీ తెలంగాణకు ఏం చేశారని విమర్శించే వారికి ఈ లెక్కలే సమాధానమని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం రాజకీయ విమర్శలు చేయడం మానేసి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు, ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం పాత్రను విస్మరించి మాట్లాడటం సరికాదన్నారు. మొత్తానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు కాంగ్రెస్, ఇటు బిజెపి శ్రేణుల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి.

Also Read: రాయచోటిలో రూ. 6 కోట్లతో కృష్ణ మందిరం.. భూమి పూజ చేసిన మంత్రులు

Advertisement

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×