E-Paper
Advertisement

Swarna Nagari Express: స్వర్ణనగరి రైలులో మంటలు.. సిబ్బంది అలర్ట్, తప్పిన పెను ప్రమాదం

Swarna Nagari Express: స్వర్ణనగరి రైలులో మంటలు.. సిబ్బంది అలర్ట్, తప్పిన పెను ప్రమాదం
Advertisement

Swarna Nagari Express: స్వర్ణనగరి ఎక్స్‌ప్రెస్‌ రైలుకి పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా రైలులో మంటలు చెలరేగాయి. వెంటనే అలర్టయిన రైల్వే సిబ్బంది స్పందించారు. రైలు ఆపి అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఫలితంగా పెను ప్రమాదం తప్పింది. ఇంతకీ రైలు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తోంది.

స్వర్ణనగరి రైలులో చెలరేగిన మంటలు

Advertisement

ఈ మధ్యకాలంలో రైలులో మంటలు చెలరేగుతున్న ఘటనలు క్రమంగా పెరుగు తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడో దగ్గర ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఢిల్లీ నుండి జైసల్మేర్ వెళ్తున్న స్వర్ణగరి ఎక్స్‌ప్రెస్ రైలు పెను ప్రమాదం తప్పింది.

ఆ రైలు.. జేతా-చందన్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా ఓ రైలు కోచ్ కింద నుంచి అకస్మాత్తుగా నిప్పురవ్వలతోపాటు మంటలు చెలరేగాయి. ఉన్నట్లుండి పొగ రావడంతో ప్రయాణికులతోపాటు రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈలోగా రైలుని నిలిపివేశారు.

Advertisement

అలర్టయిన రైల్వే సిబ్బంది.. అదుపులోకి మంటలు

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన ప్రయాణికుల్లో భయాందోళనలకు గురిచేసింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే విభాగం తెలిపింది. వెంటనే రైల్వే సాంకేతిక బృందం అక్కడికి చేరుకునింది.

కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్వర్ణనగరి రైలు జైసల్మేర్‌కు బయలుదేరింది.  ఈ రైలు ఆదివారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుంచి జైసల్మేర్‌కు బయలుదేరింది. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా వెళ్లాల్సిన రైళ్లు దాదాపు గంట వరకు నిలిపివేశారు అధికారులు.  ఆ తర్వాత మెల్లగా కదులుతున్నాయి.

ALSO READ: చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను 

బ్రేక్ సిస్టమ్‌లో ఓ భాగంలో అధిక వేడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే మంటలకు ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు. రైల్వే సాంకేతిక బృందం వివరణాత్మక దర్యాప్తును కొనసాగిస్తోంది. రైల్వే సిబ్బంది, లోకో పైలట్ వెను వెంటనే వ్యవహరించిన తీరును ఉన్నతాధికారులు ప్రశంసించారు.

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×