E-Paper
Advertisement

Vande Bharat Sleeper Menu: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!

Vande Bharat Sleeper Menu: ఇక చికెన్, మటన్, ఫిష్ కూడా.. వందేభారత్ స్లీపర్ లో కొత్త మెను వచ్చేసింది!
Advertisement

Vande Bharat Sleeper Dining Upgrade: వందేభారత్ స్లీపర్ రైలుకు సంబంధించి ఫుడ్ మెనులో స్థానిక వంటకాలకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయారిటీ ఇచ్చింది. హౌరా- గౌహతి మధ్య సర్వీసులు అందిస్తున్న వందేభారత్ స్లీపర్.. బెంగాల్, అస్సోం వంటకాలకు ఫుడ్ మెనులో ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, తాజాగా కొత్త మెనును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు IRCTC ప్రకటించింది. తాజాగా కొత్త ఫుడ్ లిస్టుతో కొత్త మెనును ప్రకటిచింది.

వందే భారత్ స్లీపర్ రైల్లో కొత్త ఫుడ్ మెనూ

తాజాగా హౌరా–కామాఖ్య–హౌరా వందే భారత్ స్లీపర్ రైలులో ప్రయాణికులు వెజ్, నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్స్ ను తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1న, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందేభారత్ స్లీపర్ ఫుడ్ కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైలులో త్వరలో నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్స్ ను కూడా తీసుకొస్తామని వెల్లడించింది. గతంలో, IRCTC విడుదల చేసిన మెనూలో ఫిష్, చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ ఆప్షన్స్ లేవు.

Advertisement

టీ, బిస్కెట్లు, మఫిన్లతో పాటు, హౌరా నుంచి కామాఖ్యకు వందే భారత్ స్లీపర్ (రైలు నంబర్ 27575)లో ప్రయాణించే ప్రయాణికుల కోసం IRCTC మూడు వేర్వేరు ఫుడ్ మెనునూ రెడీ చేసింది. రైలు నంబర్ 27575, హౌరా-కామాఖ్య వందే భారత్ స్లీపర్‌లో ప్రయాణించే ప్రయాణికులకు బసంతి పులావ్, గీ రైస్, పచ్చి బఠానీ పులావ్‌ తో పాటు పరోటా, చోళర్ పప్పు, ఆలూ గజర్ మేథి మతార్ భాజా, ఝురి ఆలూ భజా కూడా అందిస్తారు.  భోజనంలో మాతార్ పన్నీర్, చానర్ దల్నా, ధోకర్ దల్నా కూడా ఉంటాయి. నాన్ వెగ్ మెనూలో బెంగాలీ చికెన్ కర్రీ, ముర్గ్ రోగిని,ముర్గిర్ జోల్ ఉంటాయి. డెజర్ట్ ఆప్షన్స్ లో సందేశ్, కాలా జామున్, ఖీర్ కదమ్ ఉంటాయి.

వందే భారత్ స్లీపర్ రైలు కోసం IRCTC ఆహార మెను

అటు టీ, బిస్కెట్లు, మఫిన్లతో పాటు, వందే భారత్ స్లీపర్ ప్రయాణీకులకు IRCTC మూడు స్పెషల్ ఫుడ్ మెనులను రెడీ చేసింది. కామాఖ్య-హౌరా వందే భారత్ స్లీపర్‌ లో జీరా రైస్, జీరా కార్న్ పులావ్, కిస్మిష్ పులావ్‌ తో పాటు తెహ్దార్ పరాఠను అందిస్తారు. ఇందులో మిక్స్ డ్ పప్పు, లెసెరా ఆలూ భాజీ, భేండి ఆలూ భాజీ, బీన్స్ ఆలూ భాజీ కూడా ఉంటాయి. ఇక ఫుడ్ లో పన్నీర్ మసాలా, కడై పన్నీర్ కూడా ఉంటాయి. నాన్ వెజ్ ఫుడ్ ఆప్షన్లలో చికెన్ మసాలా, చికెన్ కర్రీ ఉంటాయి. డెజర్ట్ ఆప్షన్లలో నారికల్ బర్ఫీ, లాల్ మోహన్, రసగుల్లా ఉంటాయి.

జనవరి 17న స్లీపర్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

Advertisement

జనవరి 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రారంభించారు. కామాఖ్య-హౌరా-కామాఖ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ జనవరి 22 నుంచి తన కమర్షియల్ ఆపరేషన్స్ ను మొదలుపెట్టింది.

Read Also: ప్రయాణీకులకు అలర్ట్.. రెండు రోజుల పాటు ఈ రూట్లలో 8 రైళ్లు క్యాన్సిల్!

Related News

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

వర్షాకాలంలో తామరపూల స్వర్గం.. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం!

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

అర్ధరాత్రి కూడా భానుడి ప్రతాపమే.. భూమిపై సూర్యుడు అస్తమించని ఆ 5 వింత ప్రదేశాలేవో తెలుసా?

మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

Big Stories

Advertisement
×