E-Paper
Advertisement

Tollywood: అధ్యాయం ముగిసింది.. విడాకులు ప్రకటించిన ప్రముఖ జంట!

Tollywood: అధ్యాయం ముగిసింది.. విడాకులు ప్రకటించిన ప్రముఖ జంట!
Advertisement

Tollywood:బుల్లితెర ప్రేక్షకులకు షాక్ ఇస్తూ నటి అనూష హెగ్డే తన వైవాహిక బంధంపై చేసిన ప్రకటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర పాపులర్ జంట అనూష హెగ్డే – ప్రతాప్ సింగ్ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. తమ మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలకు అనూష ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది. “మేమిద్దరం చట్టపరంగా విడిపోయాం” అంటూ ఆమె చేసిన ప్రకటన అభిమానులను కలిచివేస్తోంది. 2023 నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరగగా, 2025లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై ఎటువంటి చర్చలు లేదా విమర్శలు చేయవద్దని, కేవలం తన నిర్ణయాన్ని గౌరవించాలని ఆమె కోరింది. పరస్పర అంగీకారంతోనే ఈ బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

‘నిన్నే పెళ్లాడతా’ నుంచి విడాకుల వరకు:

అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్‌ల పరిచయం ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్ సెట్ లో మొదలైంది. కలిసి నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి 2020 ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటను చూసి అందరూ ముచ్చటపడ్డారు. కానీ, కాలక్రమేణా వచ్చిన మనస్పర్థలు వీరిని విడదీశాయి. ప్రస్తుతం తన పూర్తి దృష్టిని కెరీర్, కుటుంబం, మానసిక ప్రశాంతత పైనే పెట్టినట్లు అనూష వెల్లడించింది. ఒక అందమైన ప్రేమకథ ఇలా విడాకులతో ముగియడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.

Advertisement

ALSO READ:Nara Rohit – Sirisha lella: నారా రోహిత్ వెడ్డింగ్ వీడియో వైరల్.. నవ్వులు.. కోలాహాల నడుమ ఒక్కటైన జంట

కెరీర్ పరంగా బిజీగా ఉన్న నటీనటులు:

నటుడు ప్రతాప్ సింగ్ తెలుగు బుల్లితెరపై సుపరిచితుడు. స్టార్ మా టీవీ లో ‘శశిరేఖ పరిణయం’తో అందరికి పరిచయం అయిన ప్రతాప్ ఆ తరువాత ‘కుంకుమ పువ్వు’, ‘తేనె మనసులు’ వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్‌లో నిహారిక కొణిదెలకు జోడీగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని వెబ్ సిరీస్ లలో నటించారు. ఇక అనూష హెగ్డే ‘సూర్యకాంతం’ వంటి సీరియల్స్‌లో నటించినప్పటికీ, తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమ వైపు మొగ్గు చూపింది. 2022లో, ఆమె తమిళ టెలివిజన్ లో అడుగు వేసి ఆనంద రాగంలో ఐపిఎస్ ఈశ్వరి పాత్రను పోషించింది. జూన్ 2025 నుండి, ఆమె ఆనంద రాగంలో ఈశ్వరి పాత్ర లాగ చూడటానికి ఒకేలా కనిపించే తులసి పాత్రను పోషిస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె కన్నడ బుల్లితెరపై వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా, వృత్తిపరంగా ఇద్దరూ రాణిస్తుండటం విశేషం.

Advertisement

జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. బంధం ముగిసినా, కొత్త ఆశలతో ముందుకు సాగడం ముఖ్యం. అనూష, ప్రతాప్ ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

Tags

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×