Deepika Rangaraju:దీపికా రంగరాజు (Deepika Rangaraju) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం వెళ్లి విరుస్తుంది అనడంలో సందేహం లేదు. ఆమె ఎక్కడ కనిపించినా సరే ఆ వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుందని.. ఆమెతో గడిపిన వారే కాదు ఆమె కనిపించే విజువల్స్ కూడా మనకు అనిపిస్తాయి. అంతలా నవ్వుతూ అల్లరిగా కనిపించే కావ్య ఇండస్ట్రీలోకి రాకముందు పడ్డ బాధలు అభిమానులను కూడా కలిచివేస్తున్నాయి. ‘బ్రహ్మముడి’ సీరియల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దీపికా రంగరాజు ప్రస్తుతం వరుస టీవీ షోలలో కూడా హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి శ్రీదేవి డ్రామా కంపెనీ (Sridevi drama company).
ఇందులో వచ్చీరాని తెలుగులో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. వామ్మో ఈమె ఏంట్రా ఇంత ఓవరాక్షన్ చేస్తోంది అని అందరూ తలలు పట్టుకునేట్టు చేస్తున్న దీపిక శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాట్లాడుతూ.. తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా లేటెస్ట్ ప్రోమోని విడుదల చేయగా ఈ ప్రోమోలో దీపికా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరిచింది. షోలో భాగంగా కెరియర్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు మనలో ఫైనాన్షియల్ స్టార్ట్ అవ్వాలి. ఫైనాన్స్ రావాలి అంటే మనం ఏదో ఒక పని చేయాలి. ఎవరు తమ తమ జీవితాలలో ఎలాంటి పని చేసి మొదటి రెమ్యునరేషన్ అందుకున్నారు అని యాంకర్ రష్మీ ప్రశ్నించగా.. జబర్దస్త్ పొట్టి నరేష్ మాట్లాడుతూ..” రాకింగ్ రాకేష్ నాకు 500 రూపాయలు ఇచ్చారు” అని చెప్పగా.. దీపికా రంగరాజు మాట్లాడుతూ.. “నా మొదటి శాలరీ 20 రూపాయలు మాత్రమే” అంటూ తాను చేసిన పని గురించి చెప్పుకొచ్చింది. అయితే ఆమె ఏం చేసింది అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు.. ఇక పూర్తి ఎపిసోడ్ మార్చి 15న ప్రసారం కానుంది. మరి ఆమె ఏం చెప్పింది అనే పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ప్రస్తుతం దీపిక షేర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
ALSO READ:Seerath kapoor: నిర్మాతలకు సీరత్ మాస్ వార్నింగ్.. చర్యలు తప్పవంటూ హెచ్చరిక!
దీపికా రంగరాజు కెరియర్ విషయానికి వస్తే..’చిత్రం పేసుతాడి’ అని తమిళ సీరియల్ తో హీరోయిన్గా తన కెరియర్ ను మొదలుపెట్టింది. అది పూర్తయ్యే సమయానికి బ్రహ్మముడిలో అవకాశం అందుకుంది. ఇక ఈ సీరియల్ ప్రారంభం కాకముందే దీని గురించి విపరీతమైన ప్రమోషన్స్ జరగడంతో బ్రహ్మముడికి చాలా రేటింగ్ వచ్చి పడుతోంది. అలా ముందుగా కావ్య పాత్రతో అందరినీ మెప్పించిన ఈమె.. మానస్ సరసన తన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకవైపు బుల్లితెర నటిగా మరొకవైపు ఎంటర్టైనర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటుంది దీపికా రంగరాజు.