E-Paper
Advertisement

Egg Prices Crash: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు, సామాన్యుడికి రిలీఫ్, రైతులు లబోదిబో

Egg Prices Crash: వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు, సామాన్యుడికి రిలీఫ్, రైతులు లబోదిబో

Egg Prices Crash: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో దాని ప్రభావం చాలా రంగాలపై ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. కేవలం దిగుమతులు మాత్రమే కాదు.. ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవేళ యుద్ధం ఆగినా తర్వాత చాన్నాళ్లు గాని అక్కడి పరిస్థితుల్లో మార్పులు రావని అంటున్నారు. దాని ప్రభావం తాజాగా కోడిగుడ్ల ధరలపై పడింది. ఫలితంగా 40 శాతం ధరలు పడిపోయాయి. ఒక్కో గుడ్డు.. ఐదు రూపాయల కంటే తక్కువకు  లభ్యమవుతోంది. సామాన్యుడి రిలీఫ్ దక్కినా.. రైతులు మాత్రం లబోదిబోమంటున్నారు.

ఇరాన్ వార్ ఎఫెక్ట్.. మార్కెట్లో పతనమైన కోడిగుడ్ల ధరలు

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సముద్ర మార్గాలు జరిగే కార్గో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల యూఏఈ, ఒమన్, ఖతార్ వంటి దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశీయ మార్కెట్‌లో గుడ్లు అమాంతంగా పడిపోయాయి. అధికంగా ఉత్పత్తి రావడంతో ధరలు బాగా తగ్గాయి. నెల కిందటి వరకు రూ. 200ల వరకు 30 గుడ్ల ట్రే అమ్ముడైంది.

తాజాగా రూ.100 నుంచి రూ.130 మధ్య పడిపోయింది.ఈ ఏడాది ఆరంభంలో రిటైల్ గుడ్డుకు రూ.8 నుంచి 10 వరకు పలికింది. మార్కెట్లలో ప్రస్తుతం రూ.5 లకు పడిపోయాయి. ఇండియాలోని వివిధ ప్రాంతాల నుంచి విదేశీ మార్కెట్లకు 30 కోట్లకు పైగా గుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయి.

సామాన్యుడికి రిలీఫ్,  లబోదిబోమంటున్న ఫౌల్ట్రీ రైతులు

నార్మల్‌గా అయితే ప్రతీరోజు దేశం నుండి రోజుకు 50 లక్షలకు పైగా గుడ్లు ఎగుమతి అవుతాయి. వీటి ఎగుమతుల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుండి ఎగుమతులు అవుతాయి. ఎగుమతులు నిలిపివేయడంతో దేశీయ టోకు ధర ఒక్కో గుడ్డు రూ.3.50 నుంచి రూ.4.30 కి పడిపోయాయి. దీని ప్రభావం పౌల్ట్రీ రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఏపీ నుంచి దాదాపు 750 కోళ్ల ఫామ్‌ల నుండి దాదాపు 4 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 1.75 కోట్ల గుడ్లు స్థానికంగా ప్రజలు వినియోగిస్తారు. వీటిలో అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు 2 కోట్ల వరకు గుడ్లు వెళ్తాయి. మిగతా గుడ్లను వివిధ రాష్ట్రాలకు లేకుంటే విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక తమిళనాడులోని నమక్కల్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు ప్రతీ రోజూ కంటెయినర్లలో 35-40 లక్షల గుడ్లను ఎగుమతి చేస్తారు.  పశ్చిమ బెంగాల్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు గుడ్లు ఎగుమతి చేస్తారు. ఏపీ గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి కానప్పటికీ ఎగుమతులను సరఫరా చేసే నామక్కల్ మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి.

ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఇప్పటికి వెళ్లిన గుడ్లను వెనక్కి తేవాల్సి పరిస్థితి ఏర్పడింది. గడిచిన 10 రోజులుగా ఉత్పత్తి అయిన గుడ్ల మార్కెట్‌కు రావడం మొదలైంది. ధరలు దాదాపు 40 శాతం వరకు పతనమైనట్టు ఫౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు గుడ్లు ఎగుమతి చేస్తారు. ఏపీ గుడ్లు గల్ఫ్ దేశాలకు ఎగుమతి కానప్పటికీ ఎగుమతులను సరఫరా చేసే నామక్కల్ మార్కెట్‌లో పతనమయ్యాయి. ధరలు చూసి పౌల్ట్రీ యజమానులు లబోదిబోమంటున్నారు.

ALSO READ: మినిమమ్ బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు.. టాప్ బ్యాంక్ ఇదే?

 

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×