Divvala Madhuri: దివ్వెల మాధురి పరిచయం అవసరం లేని పేరు. ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivas) కారణంగా అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ తన భార్యతో విభేదాల కారణంగా తన నుంచి దూరం కావడంతో మాధురి తనకు దగ్గర అయింది వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీరిద్దరూ రాజకీయ వ్యాపార రంగాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం మాధురి వకుళ సిల్క్స్ పేరిట వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ఒకవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతున్న ఈమె మరోవైపు సెలబ్రిటీగా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న మాధురి ఈ కార్యక్రమం తర్వాత బుల్లితెర కార్యక్రమాలతో పాటు, సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి మాధురి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వారసుడి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ కు తన మొదటి భార్యతో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక మాధురికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇలా అయిదుగురి అమ్మాయిల బాధ్యతలను మీరే చూసుకుంటున్నారా అనే ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నకు మాధురి సమాధానం చెబుతూ మా కారణంగా ఐదుగురు పిల్లలు ఉన్నారు. మేము ఎంతో మంది ప్రజల బాధ్యతలు తీసుకుంటున్నాము అలాంటప్పుడు మా పిల్లల బాధ్యతలు మేము ఎందుకు తీసుకోము. ఇప్పటికే ఒక అమ్మాయికి పెళ్లి అయింది రెండో అమ్మాయి కూడా పెళ్లి వయసుకు వచ్చింది. పెళ్లిలో తనకు తండ్రిగా శ్రీనివాస్ గారు ఇవ్వాల్సిన కట్న కానుకలు తండ్రిగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తిస్తారని తెలిపారు. ఇక తన పిల్లలు చాలా చిన్న వాళ్ళని ప్రస్తుతం వాళ్లు చదువుకుంటున్నారని మాధురి తెలిపారు.
నా రాజాకు వారసుడిని ఇవ్వబోతున్నాను..
పిల్లల గురించి చెప్పిన ఈమెకు వారసుడు గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. జూనియర్ దువ్వాడ రాబోతున్నారని గతంలో చెప్పారు అంటూ ప్రశ్నలు ఎదురవడంతో అవును త్వరలోనే నా రాజాకు వారసుడిని కానుకగా ఇవ్వబోతున్నాను అంటూ మాధురి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మాకు అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేదు కానీ శ్రీనివాస్ గారి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు భవిష్యత్తులో ప్రజలకు అవసరం అందుకే వారసుడిని కావాలని కోరుకుంటున్నాము. నిజానికి ఇప్పటికే మేము ప్లాన్ చేయాల్సి ఉంది కాకపోతే ఈ బిజినెస్ కారణంగా కొంత గ్యాప్ తీసుకుంటున్నామని త్వరలోనే వారసుడిని ప్లాన్ చేస్తాము అంటూ ఈ సందర్భంగా మాధురి దువ్వాడ వారసుడు గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇలా మాధురి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తపరుస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Tyson Naidu OTT: ప్రముఖ ఓటీటీ సంస్థకు టైసన్ నాయుడు స్ట్రీమింగ్ రైట్స్.. భారీ డీల్ కుదిరిందిగా!