Serial Heroines : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కోసం ఒకప్పుడు ఆడవాళ్లు మాత్రమే ఎక్కువగా చూసేవారు. కానీ ఈ మధ్య వస్తున్న సీరియల్స్ కొత్త కొత్త కథలతో ప్రేక్షకులు ఆకట్టుకోవడంతో ఇంటిలిపాది సీరియల్స్ ని ఆస్వాదిస్తున్నారు. సీరియల్స్ లోనో నటిస్తున్న నటీనటులు వ్యక్తిగత జీవితాలు గురించి తెలుసుకోవాలని చూపిస్తున్నారు.. ముఖ్యంగా సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్లు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వారి జీవిత విధానాల గురించి తెలుసుకోవాలని గూగుల్ లో తెగ వెతికిస్తున్నారు. ఈ మధ్య రెండు పెళ్లిళ్లు మ్యాటర్ కామన్ అయిపోయింది. టీవీ సీరియల్స్లలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు ఎవరో తెలుసుకోవాలని ఆడియన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు తెలుగు బుల్లితెరపై సీరియల్స్ లతో ఆకట్టుకుంటున్నారు హీరోయిన్లు ఎవరు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు తెలుసుకుందాం..
రెండు పెళ్లిళ్లు చేసుకున్న సీరియల్ హీరోయిన్లు వీరే..
జ్యోతి రాయ్..
స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. జగతి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ఆమె తన ప్రియుడు సుకు పురుషోత్తంను పెళ్లి చేసుకున్నారు. జ్యోతి రాయ్, కన్నడ ఇండస్ట్రీలో కూడా సీరియల్స్ మరియు సినిమాల్లో నటించారు. ఆమె సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఇక ఈ మధ్య జ్యోతి రాయ్ స్లిమ్ అయ్యింది. హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. అటు సోషల్ మీడియాలో కూడా మంటలు పుట్టించేలా ఫోటోలను పోస్ట్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.
పావని రెడ్డి..
బుల్లితెరపై ఆమె ఫేమస్ నటి. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ వెండితెరపై సందడి చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోంది పావని రెడ్డి.. గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 వంటి చిత్రాల్లో నటించి వెండితెరపై సందడి చేసింది.. మొదటి భర్త ఆత్మ హత్య చేసుకొని చనిపోయారు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. బిగ్ బాస్ 5వ సీజన్ లో పాల్గొన్న పావని.. అదే షోలోని కంటెస్టెంట్ కొరియోగ్రాఫర్ అమీర్ ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అమీర్ ముస్లీం అయినప్పటికీ అమ్మాయి ఇష్ట ప్రకారం హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు.
శాండ్రా జైచంద్రన్..
సీరియల్ నటి శాండ్రా జైచంద్రన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముద్ద మందారం, రాధమ్మ కూతురు, శుభస్య శీఘ్రం సహా పలు హిట్ సీరియల్స్లో నటించిన శాండ్రా.. తాజాగా తన ప్రేమ గురించి సోషల్ మీడియాలో ప్రకటించింది. తన ప్రియుడితో తీసుకున్న ఫొటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పింది. తనతో పాటుగా ఎన్నో సీరియల్స్ లలో స్క్రీన్ షేర్ చేసుకున్న సీరియల్ హీరో మహేష్ బాబుతో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది.
Also Read:సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. మెగా ఫ్యాన్స్ కు పునకాలే..
వీళ్లే కాదు.. ప్రియాంక కూడా రెండో పెళ్లి చేసుకుంది. టెలివిజన్ యాంకర్, వీడియో జాకీగా రాణిస్తున్న ప్రియాంక దేశ్పాండే తన అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ రెండో వివాహం చేసుకొన్నది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తన వివాహాన్ని గ్రాండ్గా చేసుకొన్నారు. రెండో వివాహం చేసుకొని జీవితంలో మరో ఘట్టాన్ని చేరుకున్నారు. వీళ్ళతో పాటుగా మగ వాళ్లు కూడా పలువురు రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు.