E-Paper
Advertisement

Saina Nehwal Divorce: విడాకులు తీసుకున్న మరో భారత క్రీడా జంట… పెళ్ళై 7 ఏళ్ళు దాటిన తరువాత !

Saina Nehwal Divorce: విడాకులు తీసుకున్న మరో భారత క్రీడా జంట… పెళ్ళై 7 ఏళ్ళు దాటిన తరువాత !
Advertisement

Saina Nehwal Divorce: ఇండియాలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత బోర్ కొట్టి వదిలేయడం కామన్ అయింది. చిన్న చిన్న సమస్యల కారణంగా.. విడాకులు తీసుకుంటున్నారు సెలబ్రిటీలు. సినిమాలతో మొదలుపెడితే, రాజకీయరంగ ప్రముఖులు అలాగే క్రీడా రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు.. ఇలా చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న సమస్యల కారణంగా విడాకులు తీసుకుంటున్న సంఘటనలు చాలానే వస్తున్నాయి. అయితే తాజాగా మరో క్రీడా జంట విడాకులు తీసుకుంది. భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ (Saina Nehwal Divorce), అలాగే పారుపల్లి కశ్యప్  (Parupalli Kashyap) ఇద్దరూ తాజాగా తమ వివాహ బంధానికి గుడ్ బై చెప్పారు. విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు.

Also Read: Ben Stokes: Kl రాహుల్ ను దారుణంగా అవమానించిన ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్.. పంత్ చాలా గొప్ప బ్యాటర్ అంటూ 

Advertisement

ఏడు సంవత్సరాల బంధానికి గుడ్ బై

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి ఇద్దరు.. తాజాగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ నిర్ణయాన్ని వెల్లడించింది సైనా నెహ్వాల్. ఆదివారం రోజున అర్ధరాత్రి ఈ పోస్ట్ పెట్టారు సైనా నెహ్వాల్. ఇద్దరం ఆలోచించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు దశాబ్దాల స్నేహానికి అలాగే ఏడు సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెబుతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

సైనా నెహ్వాల్ ఎమోషనల్ పోస్ట్

తన భర్త పారుపల్లి కశ్యప్ కు విడాకులు ఇస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సైనా నెహ్వాల్. లైఫ్ కొన్నిసార్లు మనల్ని వేర్వేరు దిశలకు తీసుకు వెళుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అందుకే పారుపల్లి, తాను ఇద్దరం కలిసి సుదీర్ఘంగా ఆలోచించి.. ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. పరస్పర అవగాహనతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు. తమ నిర్ణయాన్ని అభిమానులు అందరూ గౌరవించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు సైనా నెహ్వాల్. ఎప్పటిలాగే… అభిమానుల కోసం.. ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి కశ్యప్ ఇద్దరూ కూడా 2018లో పెళ్లి చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఈ ఇద్దరు మంచి స్నేహితులు. పుల్లెల గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే.. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే 2018లో పెళ్లి జరిగింది. ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు సైనా నెహ్వాల్ దంపతులు. సైనా నెహ్వాల్… రెండుసార్లు కామన్ వెళ్తే చాంపియన్గా నిలబడమే కాకుండా.. 2012 లండన్ ఒలంపిక్స్ లో కాస్య మెడల్ కూడా గెలుచుకోవడం జరిగింది. ఇక సైనా నెహ్వాల్ ప్రకటనతో… అభిమానులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Also Read: Team India : గ్రౌండ్ లో షర్ట్స్ తీసేసి సెలబ్రేషన్స్ చేసుకోవడం వెనుక కథ ఏంటి.. గంగూలీ చేసింది కరెక్టేనా !

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×