Illu illaalu Pillalu Bhadra : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు మంచి స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ఇప్పుడు అనేక ట్విస్టులతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ లో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ప్రేమ అనుబంధాల గురించి ఈ సీరియల్ లో చక్కగా చూపించారు.. అయితే మీ కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టిన ఒక అమ్మాయి తన ఆధిపత్యం గెలవాలి అని చేసే ప్రయత్నాలు ఆ కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులను తీసుకొస్తుంటాయి. అయినా కూడా ఆ ఇంటి రెండో కోడలు ఎప్పటికప్పుడు తన ఇంటిని కాపాడుకుంటూ వస్తుంది.. ఈ సీరియల్ లో ఇటీవలే కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. సుకన్య క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు ఈ సీరియల్ లోకి మరో విలన్ క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఆ కొత్త క్యారెక్టర్ ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ కానీ ఉంది.. త్వరలోనే ఆ క్యారెక్టర్ గురించి రివిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సీరియల్ లో కొత్త విలన్ గా ఇంటర్వ్యూ ఇవ్వబోతున్న లేడీ ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం..
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రస్తుతం భద్రాన్ని క్యారెక్టర్ విలన్ గా కనిపిస్తుంది. ఈమెతోపాటుగా ఆమె తమ్ముడు కూడా తమ ప్రత్యర్థి అయిన రామరాజు కుటుంబం పై ఎప్పుడు గెలవాలని చూస్తూ ఉంటారు. వీళ్ళతో పాటుగా మరో కొత్త విలన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఈ సీరియల్ లోకి విలన్ గా లేడీ ఎంటో ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఆ కొత్త క్యారెక్టర్ ఎవరో కాదు కార్తీకదీపం సీరియల్ తో ప్రేక్షకులను అలరించిన మోనిత అని తెలుస్తుంది. ధీరజ్ ని ప్రేమించి ప్రేమకు దూరమైన ఆమె ప్రేమని శాశ్వతంగా దూరం చేసేలా ప్లాన్ చేస్తుంది అని ఓ వార్త వినిపిస్తుంది.. వీళ్ళిద్దరి మధ్య దూరం పెళ్లి చేసుకునే క్యారెక్టర్ లో నటించబోతుంది అని టాక్.. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై పెద్దగా కనిపించని శోభా శెట్టి.. ఇప్పుడు ఈ సీరియల్ తో మరోసారి విలన్ గా ఎలా మెప్పిస్తుందో అని జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ శోభ శెట్టి.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పటికే కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయి తన నటనతో మెప్పించి అందరిని ఆకట్టుకుంది.. ఆ సీరియల్లో విలన్ పాత్రలో నటించిన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు మరోసారి విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంది. బిగ్ బాస్ తర్వాత ఆమె ఇప్పటివరకు మరో సీరియల్ లో నటించలేదు.. పలు సీరియల్లలో నటిస్తుంది అని వార్తలు వినిపించాయి కానీ ఇప్పటివరకు ఏ సీరియల్ లో కనిపించలేదు. సోషల్ మీడియాలో బిజీగా ఉంటూనే మరోవైపు సీరియల్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో విలన్ గా ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.