Gundeninda GudiGantalu Today episode April 11th: శృతి రవి మీనా ఒంటరిగా బాధపడుతూ ఉండటం చూసి అక్కడికి వెళ్తారు.. ఏంటి మీ నా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావా అని అడుగుతారు. నాకు ఒక సారి అయితే బాధ ఏమీ కొత్తగా అనిపించేది ప్రతిసారి ఇలానే జరుగుతుంది కదా కొత్తగా కనిపించలేదు అని మీనా అంటుంది.. ఆంటీ ఇలా చేస్తుంది నేను అసలు ఊహించలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు.. అని దొంగ చాటుగా వినడం చూస్తున్నారు మీనా రోహిణి పై అనుమానం పెంచుకుంటుంది.. రేపు ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాను వాళ్లే వచ్చి తెలుస్తారు అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. గుణ కి ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతుంది.
రోహిణి చెప్పగానే నేను మీనాని పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఆపుతాను నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అని మాట ఇస్తాడు.. అయితే ఆ విషయాన్ని దినేష్ కి చెప్తాడు.. ఇందులో నేను ఇన్వాల్వ్ అయితే కచ్చితంగా బాలుకి నా మీద అనుమానం వస్తుంది నేను మాత్రం ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదో ఒకటి చేయాలి అని గుణ అనుకుంటాడు. మీనా ఏదో ఒకటి చేస్తుంది కాబట్టి మనం రోహిణి కాపాడినట్లు కాకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లు చేసుకోవాలి అని గుణ దినేష్ తో చెప్తాడు. ఇక మీనా నీ కిడ్నాప్ చేసేందుకు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు అనుకున్నట్లుగా జరిగితే ఆ బాలుని ఒక ఆట ఆడుకోవచ్చు అని అనుకుంటారు.
మీనా పూలను తీసుకొని వెళ్లి ఇచ్చేసి ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి అని అనుకుంటుంది.. ఆ డబ్బులు నేను తీయకపోయినా అత్తయ్య నన్ను తీశాను అని అంటుంది. నా మీద ఊరికే నిందలు వేస్తుంది.. ఎలాగైనా సరే నా తప్పేమీ లేదు అని నిరూపించుకోవాలి అని నేను అనుకుంటుంది. అయితే ఇవాళ ఎలాగైనా సరే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టి అసలు దొంగ ఎవరో తెలుసుకోవాలి అని మీనా స్ట్రాంగ్ ఫిక్స్ అవుతుంది. ఒక తాత అవ్వ మీనా ను చూసి మీనా ఏంటి కంగారుపడుతుంది ఒంటరిగా వస్తుంది ఏమైందో కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రౌడీలు మీనాని అడ్డగించి బలవంతంగా తీసుకొని వెళ్తారు..
మేమందరం వచ్చేసాము మీనా ఎక్కడుందో కనిపించడం లేదు టిఫిన్ చేసే పెట్టి ఉంటుంది కదా అని రవి అంటాడు. ఆవిడ ఎక్కడికి వెళ్లిందో నాకు తెలియదు అని ప్రభావతి అంటుంది. ఎవడింటికి దొంగతనానికి వెళ్లిందో అని మనోజ్ అనగానే.. ఆ కడుపుకి అన్నం తింటున్నావా లేకపోతే ఏదైనా అడుక్కుతింటున్నావని రవి అంటాడు. పక్కన రోహిణి కూడా ఏంటి నువ్వు మీ అన్నయ్య అంటున్నావా అని అంటుంది. అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వింటున్నావ్? నువ్వు అనాల్సింది పోయి నేనంటే తప్పేంటి అని రవి అంటాడు. రవికి తోడుగా శృతి కూడా రావడంతో గొడవగా మారుతుంది.
ప్రభావతి వాడు అన్నదంట తప్పేముంది అని మాట్లాడుతుండగా సత్యం కిందకు వస్తాడు.. మీనా ఎక్కడికి వెళ్లిందో అర్థం కావడం లేదు నాన్న అని రవి అంటాడు. వీలు చూడండి అంకుల్ మీనా గురించి దొంగతనానికి వెళ్లారు అని అంటున్నారు అని శృతి అంటుంది. 40 లక్షలు తీసుకొని వెళ్ళినప్పుడు నగలు అమ్మినప్పుడు.. డబ్బులు ఉన్న కాడికి మింగినప్పుడు ఎవరు దొంగతనం చేశారో తెలీదా అని ప్రభావతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు సత్యం.. తన భర్త లేనప్పుడు తన మీద నిందలు వేయడం తప్పు అని ప్రభావతికి సత్యం అంటాడు..
బాలు ఇంట్లోకి రాగానే మీనా కోసం ఎంత వెతికినా అక్కడ లేదు అని అనగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. ఇక మనోజు ప్రభవతి అన్న విషయాలను రవి శృతి ఇద్దరు చెప్తారు.. నా మరిది చేసింది తప్పైతే నువ్వు నీ కొడుకు చేసింది.. ఏంటి నా భార్య నర నరాల్లో దొంగతనం ఉంది అని అంటున్నారు కదా.. మరి నీ కొడుకు నువ్వు చేసిందని ఏమంటారు కన్న తల్లి అని కూడా చూడను మీనాకేదన్న అయితే అని వార్నింగ్ ఇస్తాడు. నేనని ఇంటికి తీసుకొని వస్తాను అప్పుడు చెప్తాను మీ సంగతి అని బాలు వెళ్లిపోతాడు. మీనా కోసం వెతుకుతూ ఉంటాడు.. నాకున్న ఏకైక శత్రువు ఆ గుణ గాడే వాడే ఇదంతా చేశాడని నాకు అనుమానంగా ఉంది అని బాలు అనుకుంటాడు. టు మీనా ఒంటరిగా బాధపడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..