Gundeninda GudiGantalu Today episode December 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. కామాక్షి ప్రభావతి, సత్యం ను కలిపే ప్రయత్నాలు చేస్తుంది. సత్యంను అడుగుతుంది కామాక్షి.. కానీ అస్సలు దాన్ని క్షమించను అని అంటాడు. ఇన్ని తప్పులు మీద తప్పులు చేసిన వాళ్లని అసలు సహించకూడదు అని సత్యం అంటాడు. ముందు ఆవిడని మీనాకు క్షమాపణలు చెప్పమని చెప్పు అంటాడు. తన నగలు అమ్ముకొని తనమీద తన తల్లి మీద నిందలు వేసింది. ముందు మీనా కి క్షమాపణలు చెబితే అప్పుడు నేను క్షమిస్తాను అని సత్యం అంటాడు. కామాక్షి ప్రభావతి తప్పులేదని ఎంత చెప్పినా సరే సత్య మాత్రం మీనాకు క్షమాపణ చెప్పాలి అని అంటాడు.. నువ్వు నా కాపురంలో చిచ్చు పెట్టావు నా కొడుకుల ముందు నన్ను దోషి లాగా నిలబెట్టావు.. ఇన్ని చేసింది దేనికోసం బంగారం కోసమే కదా ఈగో ఈ బంగారం తీసుకొని నీ బొంద మీద కొట్టుకో అని తన చేతికున్న గాజులని మీనా పై విసిరి కొడుతుంది.. ఆ తర్వాత మీనా బాధ పడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ మీనాకు ఇవ్వాల్సిన నాలుగు లక్షలు నేను ఏర్పాటు చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వండి అని రోహిణి రిక్వెస్ట్ చేస్తుంది. సత్యం సరే ఒప్పుకోరా తను ఇస్తుందని చెప్పింది కదా అని అంటాడు. ఈ గాజులను అత్తయ్యకి ఇస్తాను ఆ డబ్బులను ఎలాగోలాగా ఏర్పాటు చేస్తాను అని రోహిణి మాట ఇస్తుంది.. రోహిణి ఇస్తుందని చెప్పడంతో బాలు సరే అంటాడు. ఇక అందరూ వెళ్ళిపోతారు.. నువ్వు అలా మొండిగా ఉంటే ఎలా వదిన నువ్వు అన్నయ్య ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా అయ్యారో చూడు అని క్లాసులు పీకుతుంది. మనోజ్ రోహిణి వచ్చి అత్తయ్య మీ గాజులు ఇవిగోండి అని అంటుంది. ఈ గాజులు నువ్వు తెచ్చావ్ ఏంటి నేను ఆ మీనా ముఖం పై విసిరేశానుగా మళ్లీ తెచ్చావు అని ప్రభావతి రోహిణిని అడుగుతుంది..
మీనా ఆ గాజులను తీసుకొని అని చెప్పింది. మనోజ్ చేసిన తప్పుకి మీరందరూ మాటలు పడుతున్నారు. మరి మీనాకి వలసిన డబ్బులు నేనే సర్దుబాటు చేస్తానని చెప్పాను మీరేం కంగారు పడకండి అంటే ఈ విషయం గురించి మీరు మర్చిపోండి అని రోహిణి ప్రభావతికి గాజులు ఇస్తుంది.. నావల్ల ఇదంతా జరిగిందమ్మా నన్ను క్షమించు అని మనోజ్ అంటాడు. నువ్వు నన్ను ఏదో ఉద్ధరిస్తావని ఎన్ని రోజులు ఊహించుకొని నీకు అడిగినదానికంటే ఎక్కువగానే సాయం చేస్తూ వచ్చా.. కానీ ఇప్పుడు నన్ను ఇలా దోషిని చేసి అందరి ముందర నిలబెడతావని అస్సలు ఊహించలేదని ప్రభావతి అంటుంది. నేను ఏ రోజుకైనా ప్యాలెస్ లాంటి ఇంట్లో ఉంచుతానమ్మ అని మనోజ్ అంటాడు.
మీనా బాధపడుతూ ఉంటుంది. నేనేం పాపం చేశానని ఇప్పుడు నన్ను ఇంతగా ఇది చేస్తూ ఉంటారు అని మీనా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నువ్వేం బాధపడుతుంది నా నువ్వేం తప్పు చేసావ్ అని బాధ పడుతున్నావు.. ఇక ఈ విషయం గురించి వదిలేసేయ్ అసలు దొంగలు ఎవరో బయటపడింది కదా ఇక మీదటంచే జాగ్రత్తగా ఉందాం అనేసి శృతి అంటుంది. అత్తయ్యకు నేనంటే ఇంత ద్వేషమా అసహ్యము ఏంటో అర్థం కావట్లేదు అని మీనా బాధపడుతుంది.
అక్కడికి వచ్చిన బాలు ఎందుకు మీ నన్ను కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. నీ మోహన గాజులు విసిరి కొట్టిన వాళ్లకోసం నువ్వు ఆలోచిస్తున్నావా? బాధపడుతున్నావా అని బాలు అంటాడు. నువ్వు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకో ఎవరితో ఎలా ఉండాలో అది తెలుసుకో అనేసి బాలు సలహా ఇస్తాడు. డబ్బుడమ్మా నిన్ను ఎవరైనా ఒక మాటంటే ఏం చేస్తావు అని అడుగుతాడు బాలు. నన్ను అత్తయ్య గనక ఒక మాట అంటే నేను రెండు మాటలతో సమాధానం చెప్తాను. ఒకవేళ నీ తప్పేమీ లేకుండా నిన్న అంటే నువ్వు ఏం చేస్తావు అని బాలు అడుగుతాడు.. నా తప్పు లేకుండా నన్ను అంటే ఇంకో నాలుగు గంటలు అని శృతి అంటుంది. నువ్వు చాలా కరెక్ట్ గా ఉన్నావు.. శృతిని చూసి నేర్చుకో అని బాలు అంటాడు..
Also Read : టాలీవుడ్కు డిసెంబర్ శాపంగా మారిందా..? అసలేం జరుగుతుంది…
ఆంటీ కి మనం పనిష్మెంట్ ఇవ్వాల్సిన పనిలేదు అంకులే ఆ పని చేశాడు అని శృతి అంటుంది. పాపం అత్తయ్య అలా ఉంటే ఎలా మీరు ఒకసారి మామయ్యతో మాట్లాడి చూడండి అని మీనా అంటుంది. అంత పెద్ద తప్పు చేసిన వాడిని రోహిణి క్షమించింది. మరి ఆంటీ ని అంకుల్ ఎందుకు క్షమించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదని శృతి అంటుంది.. మా నాన్న ఎన్ని భరిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా మా అమ్మ తప్పులు తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది అని బాలు అంటాడు. ప్రభావతి మనిద్దరం బయటికి వెళ్దాం నా మనసేం బాగోలేదు అని కామాక్షిని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..