Gundeninda GudiGantalu Today episode February 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆ గుణాని కలిసి అతని దగ్గర డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాను అని రోహిణి అంటుంది. వీడ పీడ విరగడైపోతే మనోజ్ తో నేను చాలా సంతోషంగా ఉంటాను అని రోహిణి అంటుంది. అని రోహిణి అక్కడికి వెళ్లి దినేష్ కి డబ్బులు కాకుండా వాడికి వార్నింగ్ ఇవ్వమని అడుగుతుంది.. నేను నీకు ఫెవర్ చేస్తాను కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అని గుణ అడుగుతాడు.. బాలు మీ మరిదే కదా అని రోహిణి అని అడుగుతాడు. అవును మామ మరిది అయితే ఇప్పుడేం చేయాలి అని అడుగుతుంది రోహిణి.. ఏం లేదు ఆయన బామ్మర్ది శివ గురించి మీకు తెలిసే ఉంటుంది.. ఒకసారి మీ అత్తయ్య తన డబ్బులు పోయింది అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది గుర్తుందా అని అనగానే అవును నాకు గుర్తుంది ఇప్పుడు అది ఎందుకు అడుగుతున్నావు అని రోహిణి అంటుంది.. ఇక రోహిణి గురించి ఎక్కడ తెలిసిపోతుందని మీ నాకు సమస్య అంటూ కొత్త నాటకం మొదలు పెడుతుంది.. అయితే మీనా రోహిణి చెప్పింది నిజమవుతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రవికి రాత్రి వాళ్ళ బాస్ ఫోన్ చేయడంతో శృతి సీరియస్ అవుతుంది.. రవి శృతిని తన డబ్బింగ్ స్టూడియో వరకు వెళ్లి క్షమాపణ చెప్తాడు దాంతో శృతి కూల్ అవుతుంది. ఇక తర్వాత రాత్రి ట్రిప్ కు వచ్చిన డబ్బులను లెక్కపెడుతూ ఉంటారు మీనా బాలు.. అయితే వాళ్ళిద్దరూ డబ్బులని లెక్కపెడుతూ పొద్దున జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. తాతయ్య అమ్మమ్మ ఎంత కష్టపడుతున్నారో చూసారా ఈరోజుల్లో వాళ్ళు అంత కష్టపడడం ఏం బాగోలేదు కదా అని మీనా బాలు మాట్లాడుకుంటూ ఉంటారు.. మనం ఆ వయసు వస్తే అలా కొడుకుల మీద ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడేలా డబ్బులు సంపాదించి పెట్టుకోవాలి అని మీనా అంటుంది.
మీనా నిజమే ఇప్పుడు మనం అర్జెంటుగా ఇల్లు కట్టేసి ఆ తర్వాత మనకోసం మనం సంపాదించి పెట్టుకోవాలి అని బాలు అంటాడు. ఆ తర్వాత మనం ముసలి వాళ్ళమైతే ఎలా ఉంటుందో అని బాలు కలలోకి వెళ్లి ఊహించుకుంటాడు. నా బాలు ఇద్దరూ ఎంతో చక్కగా అందంగా కనిపిస్తారు. కలలోకి కూడా వాళ్ళిద్దరూ చాలా సరదాగా సంతోషంగా ఉంటారు. ఇక తర్వాత ఉదయం లేవగానే బాలు ఉలిక్కిపడి లేస్తాడు.. రాత్రి మాట్లాడుకున్న వాటిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు.. ఆ తర్వాత రోహిణి బాలు ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది.. ఎలాగైనా సరే ఆ ఫోన్ కొట్టేయాలని అనుకుంటుంది..
బాలు లేసి మీనా నాకు ట్రిప్ ఉందని చెప్పాను కదా ఎందుకు లేపలేదు అని సీరియస్ అవుతాడు.. మిమ్మల్ని నేను చాలా లేపాను.. లేనప్పుడు మీరే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అని రెండు గంటలు పడుకున్నారు.. కానీ ఇంత లేట్ అయింది అంటే కారణం మీరే కదా అని బాలు మీ మీనా తిడుతుంది.. ఇది ఏం చేస్తున్నావు పూరి కుర్మా చేస్తున్నావా అని బాలు అంటాడు.. ఇక నేను వెళ్లి ఫోన్ చార్జింగ్ పెట్టి స్నానం చేసి వస్తాను నువ్వు తొందరగా పూరి కుర్మా చేసి ఉంచు అని అంటాడు.
బాలు అలా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి లోపలికి వెళ్ళగానే రోహిణి ఆ గదిలోకి వెళ్లి ఆ ఫోన్ని తీసుకుంటుంది.. అయితే బాలు అప్పుడే మీనా టవల్ కావాలని గట్టిగా కేకలు వేయడంతో రోహిణి వెళ్లి మంచం కింద దాక్కుంటుంది.. ఆ తర్వాత రోహిణి వీళ్లిద్దరి రొమాన్స్ చూడలేక చచ్చిపోతున్నాను ఈ ఫోన్లో వీడియో దొరికితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది.. స్నానం చేసి వచ్చిన తర్వాత మీనా ఒకటే ఉంటుంది కదా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు.. ఇప్పుడు మీనా తో కాసేపు సరదాగా గడపొచ్చు అని బాలు అనుకుంటాడు.. బాలు మీనా ఇద్దరి రొమాన్స్ చూసి రోహిణి అనవసరంగా వీళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్ననే ఎలా బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటుంది..
ప్రభావతి ఫోన్ మాట్లాడడం చూసి రోహిణి అయ్యో అత్తయ్యకి నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిపోతే నా పని అంతే అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక రోహిణి వీడియో కోసం వెతుకుతుంది ఆ వీడియో దొరకగానే అంతలోకే ఫోన్ చార్జింగ్ అయిపోతుంది.. అయ్యో అదృష్టం వచ్చి సెకండ్ ఇస్తే దరిద్రం వచ్చి వెనక్కి లాగేసింది కదా ఇలా జరిగింది ఏంటి అని రోహిణి మంచం కింద టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. కానీ మనోజ్ రోహిణిని వెతుకుతూ ప్రభావతిని సత్యంని అందరినీ అడుగుతూ ఉంటాడు.. ఎందుకు రోహిణితో ఏం పని అని అనగానే నాకు 500 అవసరమైంది తనని అడుగుదామని వెతుకుతున్నాను ఎక్కడ కనిపించలేదు అని మనోజ్ అంటాడు..
ఎవరికి బాలు దగ్గరికి వచ్చిన మనోజ్ డబ్బుల కోసం అడుగుతాడు.. కానీ మనోజ్ కి డబ్బులు లేవని చెప్పి పంపిస్తాడు.. మీనా బాలుల రొమాన్స్ ఎపిసోడ్ కి హైలెట్గా నిలుస్తుంది. ఇక బాలు ఫోన్ ని ఎక్కడ పెట్టానో వెతుకుతూ ఉంటాడు అప్పుడే బయటనుంచి రోహిణి లోపలికి వస్తుంది.. ఆ ఫోను ఎక్కడ పోయిందో కనిపించలేదా. నీళ్లు అంత వెతుకుతూ ఉంటారు. కానీ సత్యం మాత్రం ఇందాక నిన్న 500 అడిగాడు. అయితే మనోజ్ ఫోన్ ని తీసుకుని ఉంటాడు అని సత్యం అనుమాన పడతాడు.. ఇక ఫోన్ అక్కడ దొరికింది అని చెప్పగానే మనోజ్ పై సీరియస్ అవుతాడు బాలు.. రోహిణి మనోజ్ అంత చీప్ గా కనిపిస్తున్నాడా నీకు అని మనోజ్ ను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది..
Also Read : తల్లికి మాటిచ్చిన కొడుకులు.. శ్రీవల్లి మాస్టర్ ప్లాన్.. అడ్డంగా ఇరుక్కున్న సాగర్..
రవి, తన బాస్ తో కలిసి షాపింగ్ రావడం చూసిన శోభా వాళ్ళిద్దరు చూసి అనుమాన పడుతుంది.. ఏంటండీ మీరు ఇక్కడికి వచ్చారు అని సోపాన్ని అనగానే.. మీరు చెప్పు కదా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అని రవిని శోభా అడుగుతుంది.. నీతూ గురించి చెప్పగానే శోభ కి అనుమానం మొదలవుతుంది.. వాళ్ళిద్దర్నీ చూసి శోభ ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది.. ఇది అల్లుడు గారిని వలలో వేసుకునేలా ఉంది. శృతికి చెప్పకపోతే కూతురు జీవితాన్ని నాశనం చేసిందని అవుతానని శోభ అనుకుంటుంది. శృతికి నిజం చెప్పాలని వెళ్తుంది శోభ. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..