Gundeninda GudiGantalu Today episode February 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి చింటూ కోసం స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని వెళుతుంది. ఎంత ఖర్చయిన పర్వాలేదు నేను ఇస్తానని అంటారు.. ఈ విషయాన్ని సుగుణమ్మకు రోహిణి చెప్తుంది. అయితే ఆ మాట వినగానే సుగుణమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. ఇకపోతే చింటూ గురించి ఆలోచిస్తూ ఉంటాడు బాలు ఇంటికి రాగానే మీనా మనం ఇంకా టైం తీసుకుని మరోసారి అడుగుదాం ఆల్రెడీ ఏమంటుందో చూద్దామని అంటారు.. ఇక శృతి మీనా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అత్తయ్య మనల్ని గొడవ పడట్లేదు అని అనుకుంటే ఏడుస్తుంది ఏమో అని అనుకుంటుంది..
సత్యం ప్రభ రా తిందాం అని అనగానే శృతి మీనా గొడవ పడుతున్నట్లు నటిస్తారు. మీరు మావిడిని మోసం చేస్తున్నారు మరి నేను ఆ మాత్రం మిమ్మల్ని మోసం చేయాలి కదా అని సత్యం అనగానే ఇద్దరు కూడా మావయ్య అని అంటారు.. మీనాని ఎప్పుడు ఆంటీ తిడుతూనే ఉంటుంది ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో అని శృతి అంటుంది.. ఇక మీనా ప్రభావతికి బిర్యాని తీసుకొని వెళ్లి పెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీనా ప్రభావతి కోసం బిర్యాని తీసుకొని వెళుతుంది. అక్కడున్న పిల్లలు ఇద్దరు లవర్స్ మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కానీ ప్రభావతి కి మాత్రం ఎక్కడా అనుమానం రాదు. అయితే మీనా ప్రభావతి కోసం తెచ్చిన బిర్యానిని కామాక్షి కూడా తినాలని అనుకుంటుంది. అయితే కామాక్షి చేసిన వంటని పక్కనపెట్టి మీనా వడ్డించిన బిర్యానీని ఇద్దరు ఫుల్లుగా లాగించేస్తారు.. బయట ఉన్న లవర్స్ ని చూసి మీనా జాగ్రత్తగా డాన్స్ నేర్చుకోండి లేదంటే మాత్రం బాగోదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది.. ప్రభావతి ఇంటికి వచ్చిన తర్వాత బిర్యాని ఫుల్లుగా తినడంతో ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. మీనా రాగానే బిర్యానీ ఎక్కడ నుంచి తెచ్చావు ఇదిగో హోటల్ బిల్లు అంటూ అంటుంది.. రోహిణి మాత్రం అత్తయ్య గారిని చంపాలనుకుంటున్నావా అని మీనాతో అనడంతో మీనా షాక్ అవుతుంది..
అయితే మీనాని రోహిణి తిడుతుంది.. ఇప్పటివరకు బాగానే ఉన్నా అత్తయ్య గారిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో మీనా అని అడుగుతుంది.. అయితే ఈ బిల్లు చూడండి ఇది హోటల్ నుంచి తెచ్చిన బిర్యాని అని ప్రభావతి అంటుంది.. అయితే ఆ బిల్ ను చూసిన బాలు డిసెంబర్ 12వ తారీకుది నేను రాజేష్ ఇద్దరు కలిసి బిర్యానీ తెచ్చుకుని తిన్నాము అని అనగానే ప్రభావతితో పాటు మిగిలిన వాళ్ళందరూ షాక్ అవుతారు. అప్పుడే రంగ సత్యం కి ఫోన్ చేసి ప్రభావతి ఎలా ఉంది అని అడుగుతాడు.. ఏమైందిరా ఎందుకు అలా అడుగుతున్నావు అని సత్యం అడుగుతాడు..
అదేదో కొత్త వంటంట్రా దానికి కారణం కామాక్షి నే అని అనడంతో.. అక్కడున్న వాళ్ళందరూ కూడా అయ్యో మీన తప్పేమీ లేదు అని షాక్ అవుతారు.. ఆ మాట వినగానే రోహిణి మెల్లగా జారుకుని బయటికి వెళ్ళిపోతుంది. అది చూసిన మీనా రోహిణి ఎక్కడికి సైలెంట్ గా జారుకుంటున్నావు. ఇప్పటివరకు ఏదేదో అన్నావు కదా ఇప్పుడేమంటావు అని రోహిణి పై మీనా సీరియస్ అవుతుంది.. అదేదో కామాక్షి చేసిన వంట తిన్నాను అంట నా పరిస్థితి దారుణంగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ప్రభావతి అనుకుంటుంది. ఇక మనోజ్ రాత్రి నిద్ర పోతూ ఉంటే తనకొచ్చిన లెటర్ గురించి ఆలోచిస్తాడు.
Also Read :శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
ఆ లెటర్ లోని పదాలను ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని ఉలిక్కిపడి లేస్తాడు.. ఆ లెటర్ గురించి ఎలాగైనా సరే అమ్మతో చెప్పాలని అనుకుంటాడు.. ముందుగా రోహిణి చెప్తే ఏమనుకుంటుందో అని అనుకుంటాడు. కానీ రోహిణి లైట్ తీసుకుంటుందని ప్రభావతికి ఫోన్ చేసి పైకి రమ్మని పిలుస్తాడు. అక్కడికి వెళ్లిన ప్రభావతి ఏమైందిరా ఏం జరిగింది? ఎవరు పోయారు ఇంత అర్జెంటుగా అర్ధరాత్రి ఫోన్ చేసి రమ్మన్నావు అని తిడుతుంది.. ఒకసారి నాకు ఒక లెటర్ వచ్చిందని చెప్పాను కదా అమ్మ.. ఇప్పుడు మరొక లెటర్ వచ్చింది.. ఆ లెటర్ గురించి చెప్పగానే ప్రభావతి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రోహిణి బండారం బయట పడుతుందేమో చూడాలి..