Gundeninda GudiGantalu Today episode May14th: బాలుకి రోహిణి గుణ దగ్గరకి డబ్బులు తీసుకుంది అని మీనా చెబుతుంది. అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఎవరికిచ్చింది నాకు ఏదో అనుమానంగా ఉంది అని బాలు కూడా అంటాడు. ఇక రోహిణి సత్యం గదిలోకి వెళ్లి మావయ్య నన్ను క్షమించండి. మీ కొడుకు బాగుపడాలని ఇలా చేశాను అని ఎంతగా చెప్తున్నా సరే.. సత్య మాత్రం అయిపోయింది కదమ్మా ఇక ఎవరిని క్షమించాల్సిన అవసరం లేదు అని అంటాడు. అత్తయ్య నన్ను ఎంతగా అవమానించిందో మీరు కూడా చూశారు కదా మావయ్య. క్షమించాను అని ఒక్క మాట చెప్పండి నేను సంతోషంగా ఉంటాను అని సత్యంని అడుగుతుంది రోహిణి. నేను మీ అత్తయ్య అంతగా నమ్మింది తన నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు కాబట్టే తను చాలా బాధతో నిన్ను కొట్టింది అని సత్యం అంటాడు..
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు..మీనా అందరికీ వడ్డిస్తుంది. అయితే అందరూ తింటూ ఉండగా అప్పుడే రోహిణి భోజనానికైనా అక్కడికి వస్తుంది. అందరిని చూసి రోహిణి భోజనం తినడానికి కూర్చోకుండా కంగారు పడిపోతూ ఉంటుంది.. రోహిణి వచ్చేసింది చూసిన అందరూ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.. అయితే తను తినడానికని కూర్చోగానే.. ప్రభావతి చాలా సీరియస్ అవుతుంది. ఇకనుంచి కూర్చోవడం ఎందుకు లే అని గట్టిగా అరుస్తుంది. అమ్మ రోహిణి కూడా ఆకలేస్తుంది అనుకుంటా అమ్మ తిననివ్వు అని మనోజ్ ఎంత చెప్తున్నా సరే.. ప్రభావతి మాత్రం ఎవరి మాట వినకుండా లేచి బయటకు వెళ్ళమని అవమానిస్తుంది.. అందరూ ఎంత చెప్తున్నా సరే రోహిణి మాత్రం తినడానికి ఇష్టపడడు ప్రభావతి.
తినడానికి వచ్చిన వాళ్ళని కూర్చున్నప్పుడు లేపడం తప్పు అని మీనా అంటుంది. అయితే ప్రభావతి నీ పని నువ్వు చూసుకో నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకుంటే మంచిది అని మీ నాకు వార్నింగ్ ఇస్తుంది. తినడానికి వచ్చిన వాళ్ళని కూర్చొని ఇవ్వకుండా చేయడానికి మీరు మనుషులా కాదని బాలు అంటాడు.. పెళ్ళాన్ని ఇంతగా అవమానిస్తున్న సరే పంది లాగా మేస్తున్నాడు వీడు అని మనోజ్ ని తిడతాడు బాలు. అని బాలు మాత్రం రోహిణి కి సపోర్ట్ గా మాట్లాడతాడు.. కానీ రోహిణి మాత్రం నా కోసం మీరు ఎవరు గొడవపడాల్సిన అవసరం లేదు అని అంటుంది.. ఇక బాలు కి ప్రభావతి నోరు మూసుకొని పని నువ్వు చూసుకోరా అని షాక్ ఇస్తుంది..
రోహిణి నాకు కన్నతల్లి ఉంటే ఇలా అవమానించేది కాదు కదా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే, రోహిణి కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ వెళ్తుంది. అయితే బయటికి వెళ్లిన రోహిణి దగ్గరికి వెళ్తుంది.. ప్రభావతి చేసిన అవమానం గుర్తుచేసుకొని బాధపడిపోతుంది.. అయితే కామాక్షి టిఫిన్ తీసుకుని వచ్చి పెట్టిన సరే రోహిణి మాత్రం నాకు ఇప్పుడు ఆకలిగా లేదు పిన్ని అత్తయ్య అన్న మాటలే నాకు గుర్తొస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నాకు ఆ ఇంటికి వెళ్లాలని అనిపించలేదు పిన్ని అని అంటుంది.. ఏం బాధపడకమ్మా మీ అత్తయ్యతో నేను మాట్లాడతాను కానీ ఇప్పుడు ఆవిడ చాలా కోపంగా ఉంది అని అంటుంది.. అయితే రోహిణి ఒక పేపర్లో మీరేం అడగాలో నేను రాసిస్తాను అది అడగండి చాలు అని అంటుంది. కామాక్షి రోహిణి మాట విని నమ్ముతుంది.
మీనా ఒక పెద్ద హోటల్ కి డెకరేషన్ గురించి చెప్పాలని వెళ్తుంది. ఇది చాలా పెద్ద హోటల్ లాగా ఉంది మీనా నేను ఇక్కడ ఉంటాను నువ్వు మాట్లాడేసి రా అని బాలు ఎంత చెప్తున్నా సరే లేట్ అయ్యేలా ఉండండి మీరు వెళ్ళండి అని బాలుని పంపిస్తుంది మీనా.. మీనా అక్కడున్న మేనేజర్ తో మాట్లాడుతూ ఉండగా చింతామణి అక్కడికి వచ్చి ఇవే నన్ను చేస్తున్న డెకరేషన్ లో అని తనని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అంతేకాదు మీనా చూపించాలని తెచ్చిన డెకరేషన్ ని తన మనుషులు చేత పాడు చేయిస్తుంది.. ఇక్కడ నా భర్త ఉంటే మీకు ఎలా చెప్పే వాళ్ళు అలా చెప్పేవాళ్ళు అని మీనా అంటుంది.. నువ్వు నా ఏరియాలో కాదు నన్ను కాదని ఏ ఆర్డర్ ని తీసుకోలేవు అని చింతామణి మీనాకు వార్నింగ్ ఇస్తుంది. కానీ మీనా మాత్రం నీ కన్నా పై స్థాయిలోకి వెళ్లి చూపిస్తానని చాలెంజ్ చేస్తుంది.
కామాక్షి దగ్గరికి వచ్చిన ప్రభావతి డాన్స్ క్లాస్ కి ఎవరూ రాలేదేంటి ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది.. నువ్వు రెండు రోజుల నుంచి రాలేదు కదా అందుకే నాకు వచ్చిన నాలుగు స్టెప్పులు నేర్పించి వాళ్ళని పంపించాను.. ఇవాళ మాస్టర్ రాలేదు సెలవు తీసుకోండి అని చెప్పి పంపించాను అని కామాక్షి అంటుంది. అయితే కామాక్షి రోహిణి గురించి మంచిగా చెప్పాలని అనుకుంటుంది. రోహిణి గురించి తను రాసిన స్క్రిప్ట్ ప్రకారం చెప్పాలని కామాక్షి అనుకుంటుంది. కానీ కామాక్షి మాత్రం రోహిణి దగ్గర డబ్బులున్నాయి కదా మనోజ్ ను తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. నాకు బాగా తెలుసు అని ఫీల్ అవుతుంది.
సత్యం సాయంత్రం ఇంటికి రాగానే మీనా మీతో ఒక విషయం చెప్పాలి మావయ్య అని అడుగుతుంది. రోహిణి ఎవరితో ఏమీ మాట్లాడట్లేదు దిగులుగా ఉంటుంది. ఏదైనా రోహిణి తో మాట్లాడింది మావయ్య అని మీనా అడుగుతుంది.. ఎవరితోనూ మాట్లాడట్లేదు ఎవరితోనూ కలవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య అని మీనా అంటుంది. కానీ అత్తయ్య మాత్రం వాళ్ళిద్దర్నీ కలవనివ్వకుండా మాట్లాడనివ్వకుండా చేస్తుంది అని మీనా నిజం చెప్తుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ప్రభావతి ఏంటి ఏం చెప్తున్నావ్ నువ్వు ఈయన గారికి అని ప్రభావతి అడుగుతుంది. ఆయనతో ఏం మాట్లాడుతున్నావో చెప్పు అని ప్రభావతి అనగానే.. రోహిణి భోజనం చేయలేదని చెప్పాను అని ప్రభావతి అంటుంది. నా మీద చాడీలు చెప్పడం తప్ప నీకు వేరే పని ఉండదా అని మీనా పై సీరియస్ అవుతుంది. ప్రభావతి అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..