Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. పేరెంట్స్ని చంపిన తర్వాత భారతీయ టీనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానిక ఎన్నారైల్లో కలకలం రేపింది. అసలు ఏం జరిగింది? ఎందుకు అలాంటి పని చేశాడు? మృతుడి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాలకు చెందినవారని సమాచారం.
సౌదీ అరేబియాలో ఊహించని ఘటన
సౌదీ అరేబియాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ టీనేజర్.. తల్లిదండ్రులను చంపి ఆపై అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజధాని రియాద్ సిటీలో ఈ ఘటన వెలుగుచూసింది. తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా నివాసం ఉండే హరా ఏరియాలో ఈ ఘటన జరిగింది.
రాజమండ్రికి చెందిన రవి-శ్రీదేవి సౌదీ అరేబియాలోని రియాద్లో ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక్క కొడుకు ప్రభాకర్. అక్కడ 12వ తరగతి చదువుతున్నాడు. అక్కడ ఓ బ్యాంకులో రవి ఉద్యోగం చేస్తున్నాడు. భార్య శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇక వారి కొడుకు ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో 12 తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్నాడు.
పేరెంట్స్ని చంపి ఆత్మహత్య చేసుకున్న టీనేజర్.. బాధిత ఫ్యామిలీ ఏపీకి చెందినవారు
మరి ఏం జరిగిందో తెలీదుగానీ గురువారం తల్లిదండ్రులను అత్యంత దారుణంగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత మరో ప్రదేశానికి వెళ్ళి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ప్రభాకర్. పేరెంట్స్ని చంపిన తర్వాత ఆన్లైన్లో భోజనం తెప్పించు కున్నాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు. భోజనం తర్వాత ఆత్మహత్య చేసుకోన్నట్లు అక్కడ లభించిన ఆధారాలు ద్వారా తెలుస్తోంది.
ఈ ఘటన గురించి తెలియగానే రియాద్లో తెలుగు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. రవి ఫ్యామిలీ అందరితో కలిసిమెలిసి ఉండేదని స్థానిక ఎన్నారైలు చెబుతున్నారు. కేసుకు సంబంధించిన అన్నివివరాలు సేకరించే పనిలో పడ్డారు అక్కడి పోలీసులు. ఏపీలోని వారి బంధువులకు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ALSO READ: పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్దం.. 70 మంది ఉగ్రవాదులు హతం.. 55 పాక్ సైనికులు మృతి!