Intinti Ramayanam Parvathi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం ఒకటి.. కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలను బాగా మెప్పించింది.. గతంలో వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ ఫ్యామిలీ డ్రామా రివెంజ్ స్టోరీ తో రావడంతో బుల్లితెర ఆడియన్స్ ఈ సీరియల్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఒక్క మాటలో చెప్పాలంటే సీరియల్ రేటింగ్ కూడా బాగానే ఉంది.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ టెన్ సీరియల్స్లలో ఇది మూడవ స్థానంలో ఉండడం మామూలు విషయం కాదు.. ఇందులో కుటుంబ పెద్దలుగా నటించిన రాజేంద్రప్రసాద్ పార్వతీలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా పార్వతీ నటనకు ఆడవాళ్లు బాగా కనెక్ట్ అవుతున్నారు.. అత్తగా తన కోడల్ని ఎలా చూసుకుంటుంది అన్నది ఇక్కడ ముఖ్యమైన అంశం. ఈమె అసలు పేరు కృష్ణ శ్రీ.. ఈ సీరియల్కు ఈమె తీసుకుంటున్న రెమ్యూనరేషన్? గతంలో ఈమె చేసిన సీరియల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు కృష్ణ శ్రీ.. ఈమె గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. రాజేంద్రప్రసాద్ లాంటి నటీ నటుల తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంది.. పద్మవ్యూహం ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందింది. ఈమె గతంలో నటించిన సీరియల్స్ అన్నీ కూడా మంచి టాక్ని సొంతం చేసుకోవడంతో ఆమెకు ప్రస్తుతం మంచి పాత్రలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈమె ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తుంది.. ఈ సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో వచ్చింది.. ఒక కుటుంబంలోని ముగ్గురు కోడళ్ళకు అత్తగా ఈమె నటిస్తుంది.. కోడలు అందరినీ ఏకాభిప్రాయానికి వచ్చేలా చేయడం.. కుటుంబం యొక్క పరువు ని కాపాడేలా ఈమె పాత్ర ఉంటుంది.. ప్రస్తుతం ఈ సీరియల్ కిగాను ఈమె రెమ్యూనిరేషన్ గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఈ సీరియల్ కు ఈమె దాదాపు ఒక రోజుకి 25 వేలకు పైగా తీసుకుంటుందని టాక్.. అయితే 25 రోజులకు పైగా నెలలో షూటింగ్ ఉండడంతో బాగానే సంపాదిస్తుంది..
Also Read :రామరాజు ను అవమానించిన భద్ర.. పెళ్లి ఆగిపోతుందా..? బాంబ్ పేల్చిన విశ్వం..
స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటుంది.. ఒక అమ్మాయి ఆ కుటుంబంలోని ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది. అయితే తన సొంత మేనమామ కొడుకుని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. తన ప్రేమ విషయాన్ని అందరితో చెప్తుంది.. అయితే అందరూ కూడా పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ రెండు కుటుంబాలు కలవాలంటే ఈ పెళ్లితో మనమందరం ఒకటవుతామని అనడంతో ఆ వ్యక్తి పెళ్లికి ఒప్పుకుంటాడు.. కానీ తను ప్రేమించిన అమ్మాయి సూసైడ్ చేసుకోవడంతో ఆమెతో పెళ్లి చేసుకుని వస్తాడు. తనకు దక్కని వ్యక్తిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి పంపించాలని అనుకుంటుంది. అలా ఆ ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉండకుండా చేయాలని కంకణం కట్టుకొని మరి అడుగుపెడుతుంది.. ఆ ఇంటి పెద్ద కోడలు కుటుంబం క్షేమం కోసం ఏదైన చేస్తుంది. ఈ పల్లవి యొక్క ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రతిసారి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ప్రకారం అయితే.. పల్లవి ఆ ఇంటి పెద్దయిన రాజేంద్రను చంపబోతుంది. ఇకముందు ఈ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఎదురవుతాయో చూడాలి..