E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆస్తులను కొట్టేసిన ఏకలింగం.. ఆస్తి కోసం పల్లవి ప్లాన్.. అవనిని చంపేందుకు కుట్ర..

Intinti Ramayanam Today Episode: ఆస్తులను కొట్టేసిన ఏకలింగం.. ఆస్తి కోసం పల్లవి ప్లాన్.. అవనిని చంపేందుకు కుట్ర..
Advertisement

Intinti Ramayanam Today Episode December 28th: నిన్నటి ఎపిసోడ్ లో.. స్కూల్ పరిస్థితి ఇలా ఉంది అంటే.. ఇక హాస్పిటల్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం పదండి అని ముగ్గురు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు.. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన అవని,అక్షయ్, రాజేంద్ర లు అక్కడున్న పరిస్థితిని చూసి షాక్ అయిపోతారు.. అది మొత్తం బారుగా ఉంటుంది. తాగుబోతులందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటారు అది చూసి ఏకలింగానికి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటారు. హాస్పిటల్ వాతావరణం చూసి షాక్ అవుతారు.. హాస్పిటల్ లోపలి నుంచి రోగులు వస్తారు అనుకుంటే ఇలా మందు తాగిన వాళ్ళు బయటకు వస్తున్నారేంటి అని అనుకుంటారు.

బయటికి వచ్చిన ఓ వ్యక్తి మందు కావాలంటే లోపలి దొరుకుతుంది వెళ్ళండి అని అంటాడు.. అసలు ఏం జరుగుతుందో లోపలికి వెళ్లి చూద్దాం పదండి అని ముగ్గురు లోపలికి వెళ్తారు.అక్కడ కనిపించిన పరిస్థితిని చూసి ముగ్గురు కూడా షాక్ అవుతారు. ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి లోపల శ్రీది హాస్పిటల్ లో లేకపోతే ఇంకేమైనానని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అక్కడ ఉన్న ఓ వ్యక్తి కౌంటర్ ఇక్కడుంది సిటీ నుంచి వచ్చారా? ఆడవాళ్లు కూడా మందు తాగుతారు కదా మీకు ఏం కావాలో చెప్పండి అని అడుగుతాడు. ఇది మా అమ్మ పేరు మీద కట్టించిన హాస్పిటల్ ఇలా చేసావ్ ఏంట్రా ఎవడ్రా నువ్వు అని అక్షయ్ అతని చెంప పగలగొట్టి అడుగుతాడు.. ఆ బారు గురించి తెలుసుకొని ఏక లింగం దగ్గరకు వెళ్లి గొడవకు దిగుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ప్రోమో విషయానికి వస్తే.. ఏక లింగం గురించి నిజం తెలుసుకున్న రాజేంద్ర ఆస్తులు వివరాలు కావాలి అని అడుగుతాడు. మాకు అప్పజెప్పాలి అని రాజేంద్ర కండిషన్ పెడతాడు. ఏంట్రా అప్పగించేది వీళ్ళు సంగతి ఏంటో చూడండి రా అని తన మనుషుల్ని వాళ్ళ మీదకి పంపిస్తాడు..ముగ్గురు అన్నదమ్ములు కూడా ఏకలింగం మనుషుల్ని చితగ్గొట్టేసి అతనికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తారు.. రాజేంద్రప్రసాద్ తన ఆస్తులు ఇవ్వకుంటే ఏం చేయాలో అది చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఈ ఊరికి మాత్రమే ప్రెసిడెంట్ మిగతా వాటికి కాదు కదా నీ సంగతి ఎలా తేల్చాలో నాకు తెలుసు అని రాజేంద్ర అంటాడు..

ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తారు.. భానుమతి పార్వతి ఇద్దరు కూడా బజ్జీలు తింటూ ఈ ఊరు చాలా బాగుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన పల్లవిశ్రీ చేయాలని చూసి ఆడుకునే వాళ్లకు ఏం వేలాపాల లేదు డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసారు అని భానుమతి అంటుంది. ఏంటి మీరు చెప్తే అర్థం కాదా బయటికి వెళ్ళండి అని పార్వతి కూడా సీరియస్ అవుతుంది. అత్తయ్య మేము అడుక్కునే వాళ్ళం కాదు పల్లవి శ్రీయలము అని అంటారు. మీరేంటి అవతారంలో ఉన్నారు అంటే మావయ్య గారు ఇదంతా చేశారు. అన్ని పనులు చేసి వానితో వచ్చేలా ఉంది అని అనుకుంటూ ఉంటారు.

Advertisement

అప్పుడే అక్కడికి మిగిలిన వాళ్ళందరూ వస్తారు. ఏకలింగం చేసిన మోసాన్ని రాజేంద్రప్రసాద్ అందరికీ చెప్తాడు. దాదాపు 100 కోట్ల ఆస్తిని వాడికి అప్పగించారని శ్రేయ కూడా అరుస్తుంది. వాడు ఆస్తిని ఇవ్వకుంటే ఏం చేయాలో నాకు తెలుసు మీరు ఎవరు కంగారు పడకండి అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మాకు ఆస్తి ఇవ్వాలంటే మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఉన్న ఆస్తిని మొత్తాన్ని వాడి చేతిలో పెట్టారు అని శ్రేయ అంటుంది.. మీకు ఇక్కడ ఉన్న ఆస్తులకు ఏ సంబంధం లేదు. అదంతా అక్షయ వాళ్ళ అమ్మ గారిది అని అనగానే శ్రేయ షాక్ అవుతుంది. వాటిని తిరిగి ఎలా వెనక్కి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.

ఇప్పుడు ఆస్తులు ఎవరివి అన్నది కాదు ముందు ఆ పోయిన ఆస్తిని వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టలో మనం చూసుకోవాలి అని శ్రీకర్ అంటాడు. ఇక పల్లవి ఎవరూ లేని సమయం చూసి ఆ ఏకలింగం కి ఫోన్ చేస్తుంది. ఏంటి మా ఆస్తులు అన్నిటినీ లాగేసుకున్నావంట అని పల్లవి అడుగుతుంది. ఎవరికైనా ఆస్తులు మీద ఆశ ఉంటుంది. ఖాళీగా ఉన్న వాటిని వాడుకోక ఇంకేం చేస్తారు అని అంటాడు. అవనీత నేను కొట్టిన విషయాన్ని ఏకలింగం పల్లవి తో చెప్తాడు. తాటిపాము లాంటి నన్ను కొట్టింది అది బతకడానికి వీల్లేదు అని ఏకలింగం అంటాడు. నన్ను ఎదిరించిన వాళ్ళు ఎవరు కూడా బ్రతికి బయటపడలేదు. ఇవాళ ఆ అవని నా చేతిలో చచ్చిపోతుంది అని అంటాడు.

Also Read: 2వేల కోట్లు పక్కా.. లేకుంటే నేను ఆ డబ్బులు ఇస్తాను.. ప్రభాస్ పై సప్తగిరి కామెంట్స్..

ఆ అవని చావుకి నువ్వు సాయం చేస్తే నీకు సగం ఆస్తిని రాసిస్తాను అని ఏకలింగం అంటాడు. సగమసిస్తానంటే నేనెందుకు చేయను నువ్వు చెప్పినట్టే చేస్తానని పల్లవి అంటుంది. అందరూ నిద్ర పోయిన తర్వాత ఏకలింగం మనుషులు ఇంట్లోకి వస్తారు. పల్లవి ఇవాళ అవని చావడం ఖాయమని అనుకుంటుంది. ఇక గదిలోకి వెళ్లిన ఏకలింగం మనుషులు అవనిని చంపబోతారు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. అవనిని నిజంగానే చంపేరా లేదా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

Related News

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Big Stories

Advertisement
×