Intinti Ramayanam Today Episode February 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి చక్రధర్ ని ఏం చేయాలి అని అడుగుతుంది. ఎక్కడ ఉంటే తనని చంపడం కుదరట్లేదు కదా.. ఇంట్లోనే ఉన్నాడు కదా నువ్వు మన చేతికి మట్టి అంటుకోకుండా సైలెంట్ గా వాడిని సలహా ఇస్తాడు. డాడీ చెప్పింది నిజమే కదా.. మన చేతికి మట్టి అంటుకోకుండా ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేస్తుంది పల్లవి.. అయితే రాజేంద్ర ఎక్కడికి వెళ్తే అక్కడ పల్లవి కూడా ఫాలో అవుతూ వస్తుంది.. ఒక పార్కుకి ముగ్గురు అన్నదమ్ములు తన తండ్రిని తీసుకొని వెళ్లి అక్కడ జరిగిన విషయాలను గుర్తు చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి ఆటపాటల గురించి రాజేంద్ర కు గుర్తు చేస్తూ ఉంటారు.. ఎలాగైనా సరే నాన్నకు మన విషయాలని గుర్తు చేసి కోమలోనుంచి బయటికి తీసుకురావాలి అని అనుకుంటారు.. వాళ్ల ప్రయత్నాలు చూసి పల్లవి ఈ ముసలోడు కచ్చితంగా బయటికి వచ్చేలానే ఉన్నాడు ఆలోగా నేను విని పైకి పంపించాలి అని అనుకుంటుంది…
ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ నీ చంపేయాలని అనుకుంటుంది.. జ్యూస్ లో ఏవో టాబ్లెట్స్ కలిపి పల్లవి పక్క ప్లాన్ చేసుకుంటుంది కానీ మధ్యలో కమల్ రావడంతో ఆ ప్లాను ఫెయిల్ అవుతుంది. ఇక రాజేంద్రప్రసాద్ ని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి మాత్రం ఏదో టెన్షన్ పడుతున్నట్లు అవని అనుకుంటుంది. సరే ఈ ముసలోడని చంపాలని పల్లవి ప్లాన్ చేస్తూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ ను చూసి పల్లవి షాక్ అవుతుంది.. రాజేంద్ర పల్లవి ఎటు తిరిగితే అటు తిరగడంతో ముసలోడు వచ్చాడేమో అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. నా గురించి మొత్తం చెప్పేస్తాడేమో అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. నేనే అతనికి క్షమాపణ చెప్పే సరిపోతుంది కదా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని పల్లవి మావయ్య గారు అది నేను ఎందుకు అలా చేశాను అంటే అని చెప్పబోతోంది. అప్పుడు కింద నుంచి కోటిలింగం పైకి లేస్తాడు. వీల్చరు స్క్రూ లూజ్ అయిపోయింది అందుకే నేను టైట్ చేశాను. అందులో తప్పేమీ లేదు కదా అని కోటిలింగం అంటాడు.. మాట వినగానే పల్లవి కోటిలింగం చెంప పగలగొడుతుంది.
బుద్ధుందా నీకు కొంచమైనా ఏం చేయాలో కూడా అర్థం కాదా నీకు అని పల్లవి అనడంతో కోటిలింగం ఏంటి బాగు చేస్తే కొడతారా అని అడుగుతాడు. ఆ తర్వాత అవని రాజేంద్రప్రసాద్ తనకి న్యాయం చేస్తానని చెప్పి ఇలాంటి పరిస్థితుల పడ్డారు అని బాధపడుతూ ఉంటుంది. మా అమ్మకి నాకు న్యాయం చేస్తానన్నారు. కానీ ఇప్పుడు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మాకు చాలా బాధగా ఉంది మావయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. త్వరగా కోలుకొని మళ్లీ మా ముందు తిరగాలని కోరుకుంటున్నాను అని అవని అంటుంది..
ఇక పార్వతి రావడంతో నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అవని నేను పంపిస్తుంది. ఏం జరిగినా ఇన్ని గొడవలు జరిగినా పెద్దదిక్కుగా మీరు ఉండి అన్నిటిని చిటికలో పరిష్కరిస్తారు. అలాంటి మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం చాలా బాధగా ఉంది అండి అని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. పార్వతి మాటలు విన్న రాజేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఆ తర్వాత ఉదయం శ్రేయ శ్రీమంతం కోసం అన్ని ఏర్పాట్లను చేస్తారు.. అవని శ్రేయ కి కడుపు నింపే కార్యక్రమం చేస్తున్నాము ఈ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు కలగకుండా దిగ్విజయంగా పూర్తి కావాలి అని దేవుడిని ప్రార్థిస్తుంది..
శ్రీమంతం ఏర్పాట్లను చాలా గ్రాండ్ గా చేస్తారు.. పల్లవి కూడా ఈ వేడుకకు చాలా అందంగా రెడీ అయి రావాలని అనుకుంటుంది. ఇక అందరూ కలిసి సీమంతం చేసేందుకు శ్రీ యని కూర్చోబెడతారు.. అవని ఆ సీమంతం వేడుకలని చాలా గొప్పగా చేయాలని అనుకుంటుంది.. ప్రణతి భరతులు మనము శ్రేయ వదిన కోసం చీర గాజులై తీసుకొచ్చాము కదా మీరు పెట్టండి అత్తయ్య అని మీనాక్షిని అడుగుతుంది. లేదమ్మా నా గురించి తెలిసే నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నువ్వే పెట్టు అని మీనాక్షి అంటుంది..
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ కు శుభం కార్డు.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..
ఇది విన్న పల్లవి అవని వాళ్ళ తల్లికి అవమానం జరిగితే బాధపడుతుంది నేను ఎలాగైనా సరే ఈవిడని రెచ్చగొట్టి శ్రేయ కి ఒడినింపే కార్యక్రమం చేసేలా చేస్తాను అని ప్లాన్ చేస్తుంది.. మీనాక్షి ఆ మాట అనగానే మీరు నేను అన్న మాటలు మనసులో పెట్టుకోవద్దు. మీరు పెద్దవాళ్లుగా మీ కూతురు లాంటి శ్రేయాన్ని ఆశీర్వదిస్తేనే బాగుంటుంది అని మీనాక్షిని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. దాంతో మీనాక్షి పల్లవి మాట విని శ్రేయ కి సారే పెట్టాలని అనుకుంటుంది.. ఆ తర్వాత అందరూ కలిసి శ్రీ అని కూర్చోబెట్టి పొడి నింపే కార్యక్రమాన్ని చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..