Intinti Ramayanam Today Episode February 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. కింద పడిపోయిన రాజేంద్రని చూసి ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ దేవున్ని ప్రార్థిస్తూ ఉంటారు.. అయితే అప్పుడు వచ్చిన డాక్టర్ అతని పరిస్థితి క్రిటికల్ గా ఉంది ఏమి చెప్పలేము అని అంటారు.. ఆ మాట వినగానే పల్లవి నేను తప్పించుకున్నాను అని సంతోష్ పడిపోతూ ఉంటుంది.. మావయ్య కి ఇలా జరగడానికి కారణం అవనీనేని పల్లవి అంటుంది. మావయ్య తో అవనితో మామయ్య ఏదో గొడవ పడుతున్నాడు నేను చూశాను అని అంటుంది పల్లవి.. ఏం మాట్లాడుతున్నావ్ పల్లవి కొంచమైనా బుద్ధి ఉంటే మాట్లాడుతున్నావా అని అంటుంది అవని..అప్పుడు నువ్వు మావయ్యతో మాట్లాడావా ఏం మాట్లాడావు అసలు అని పార్వతి అంటుంది.. నేను మాట్లాడింది వేరు గొడవ పడలేదు ఏది అనలేదు అని అవని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది.. ఆ తర్వాత పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులు ఆయన ఎలా కింద పడ్డారు అని ఎంక్వయిరీ చేస్తారు.. అయితే అవని మీద అనుమానం ఉంది అని అందరూ అనడంతో తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి ఎంక్వయిరీకి తీసుకొని వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవనిని అభి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వస్తాడు. అభినవ్ చూసిన పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ గారు పైనుంచి కింద పడ్డారని మీరు అనుకున్న కూడా ఆయన ఎలా పడ్డారు ఎందుకు పడ్డారు అన్నది నేను తెలుసుకుంటానని అభి అనడంతో పల్లవి షాక్ అవుతుంది.. అభి కి పల్లవి పై అనుమానం వస్తుంది. అని అడిగి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అభి పల్లవి ఎంత చెప్తున్నారు సరే వినడు.. పదిమంది చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం కాదు నిజం అబద్ధం కాదు అదేంటో నేను తెలుసుకుంటాను అని అభి అంటాడు. అభి అవనీని తీసుకొని మళ్లీ హాస్పిటల్ కి వస్తాడు..
అవనినే ఇదంతా చేసింది అని మీరు నమ్ముతున్నారా అయితే ఎవరు చెప్పారు మీరు చూశారా నేను ఎంక్వయిరీ చేస్తున్న కదా ఏం జరిగిందో అని అంటారు. నేను అనడం లేదు ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు. మావయ్య గారి ఫ్రెండ్స్ కూడా రాత్రంతా ఇక్కడే ఉన్నారు వాళ్లు కూడా ఇదే చెప్తున్నారు అని పల్లవి అంటుంది.. అసలేం జరిగిందో ఎవరిది తప్పుందో నేను తేల్చుకుంటాను అని అవి అంటాడు.. అవని తీసుకొని మనం స్పాట్ కి వెళ్దామని అంటాడు.. రాజేంద్రప్రసాద్ పడిపోయిన స్పాట్ ని చూసి అవి ఇక్కడ ఏదో జరిగింది అని అనుమానిస్తాడు.. తన తండ్రి లాంటి మామయ్యకి ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
ఇక మళ్లీ హాస్పిటల్ కి వెళ్తారు అభి అవని.. పల్లవి ఆక్సిజన్ మాస్కుని తీసేస్తే మావయ్య చచ్చిపోతాడు. ఆ తర్వాత కళ్ళు తెరవడు నోరు తెరవడు అని పల్లవి అనుకుంటుంది.. అయితే, పల్లవి ఎవరు చూడడం లేదు అని లోపలికి వెళ్లాలని అనుకుంటుంది.. అప్పుడే లోపలి నుంచి వచ్చిన కానిస్టేబుల్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. లోపలికి వెళ్లడానికి కుదరదమ్మ అది అంతే అని కానిస్టేబుల్ అంటాడు. ఆ తర్వాత నేనే కానిస్టేబుల్ కి చెప్పాను. ఇది సూసైడ్ కాదు ఎవరో మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది అని అభి అంటాడు..
Also Read : రోడ్డు పై బాలు, మీనా గొడవ.. మనోజ్ కు దొరికిన మనోజ్..శృతి, మీనా ఫైట్..
రిపోర్టులు వస్తేగానీ అసలు విషయం బయటపడదు. ఇప్పటికైతే మాకు మర్డర్ జరిగిందని అర్థమవుతుంది అని పోలీసులు అంటారు.. ఇక ఇక్కడ చాలామంది ఉండకూడదు కదా మీరందరూ ఇంటికి వెళ్ళండి నేను ఉంటాను అని అక్షయ్ అంటాడు.. పార్వతీ ప్రణతి మేం కూడా ఉంటాము అని అనగానే.. మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్తారు.. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా చేసింది అవనిని అని అందరూ దారుణంగా అవనిని అవమానిస్తారు.. పల్లవి మాత్రం రాజేంద్ర ప్రసాద్ ని ఎలాగైనా సరే చంపేయాలి అని అనుకుంటుంది.. పక్క ప్లాన్ కూడా చేసుకొని హాస్పిటల్ కి బయలుదేరుతుంది పల్లవి. అక్కడ నర్స్ గెటప్ లో వచ్చి ఎలాగైనా సరే రాజేంద్ర ప్రసాద్ ని చంపేయాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…