Collector Santosh: ప్రజలనుంచి వచ్చిన భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంతోష్ (Collector Santosh) అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భూ భారతికి సంబంధించిన ఫైళ్ళు, రిజిస్టర్లు, ఇతర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
Also Read: Tragic Incident: మహేశ్వరం కేసితండాలో విషాదం.. ఆడుకుంటూ చెరువులో పడి విద్యార్థులు మృతి!
అన్ని రికార్డులు సక్రమంగా ఉండాలని సూచించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ సమస్యలను నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సదస్సులలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి సేవలు ప్రజలకు మరింత సులభంగా, ఉపయోగకరంగా ఉండేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Also Read: Tension at SLBC Tunnel: ఎనిమిది మంది ఆనవాళ్లు దొరికాయి.. ఇక ఏ క్షణమైనా బయటకు