Intinti Ramayanam Today Episode February 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. సూసైడ్ కాదు ఎవరో మర్డర్ చేసినట్లు అనిపిస్తుంది అని అభి అంటాడు.. రిపోర్టులు వస్తేగానీ అసలు విషయం బయటపడదు. ఇప్పటికైతే మాకు మర్డర్ జరిగిందని అర్థమవుతుంది అని పోలీసులు అంటారు.. ఇక ఇక్కడ చాలామంది ఉండకూడదు కదా మీరందరూ ఇంటికి వెళ్ళండి నేను ఉంటాను అని అక్షయ్ అంటాడు.. పార్వతీ ప్రణతి మేం కూడా ఉంటాము అని అనగానే.. మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్తారు.. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదంతా చేసింది అవనిని అని అందరూ దారుణంగా అవనిని అవమానిస్తారు.. పల్లవి మాత్రం రాజేంద్ర ప్రసాద్ ని ఎలాగైనా సరే చంపేయాలి అని అనుకుంటుంది.. పల్లవి తన ప్లాన్ ప్రకారం ఒక నర్స్ గెటప్ లో హాస్పిటల్ కి వస్తుంది. అక్కడ రాజేంద్రప్రసాద్ ను చంపేయాలని అనుకుంటుంది.. అయితే అందరూ నిద్రపోవడం చూసి ఇదే కరెక్ట్ టైం అని పల్లవి లోపలికి వెళ్లి రాజేంద్రప్రసాద్ కి ఆక్సిజన్ మాస్క్ తీసి ఇంజక్షన్ ఇవ్వబోతుంది..
అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఎవరు నువ్వు అని అడుగుతుంది.. నేను డ్యూటీ నర్స్ అని పల్లవి చెప్తుంది.. అయితే అక్కడ పల్లవి అవనికి అడ్డంగా దొరికిపోతానని అనుకుంటుంది. ఏదో ఒకటి చెప్పి నర్స్ అని అవనిని నమ్మిస్తుంది. ఇంజక్షన్ చేసి ఆ తర్వాత మాస్క్ పెట్టడం మర్చిపోతోంది అవని మాస్కు ముందు పెట్టండి నేను పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాలి అని అంటుంది.. అవని రావడంతో పల్లవి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ అవని ఇంటికి రావడంతో ఏంట్రా నువ్వు హాస్పిటల్ లో ఉండకుండా ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. పోలీసులు రమ్మని పిలిచారు అందుకే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది అని అక్షయ్ అంటాడు. ఆ తర్వాత పోలీసులు ఎందుకు రమ్మన్నారు అని పార్వతి అడుగుతుంది.. నాన్నది సూసైడ్ కాదంటమ్మా ఎవరో చంపాలని ప్లాన్ చేశారంట అని చెప్పగానే పల్లవి షాక్ అవుతుంది.. ఏంటి మావయ్య గాని ఎవరో చంపాలి అనుకున్నారా అని పల్లవి సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది.. ఏంటి మావయ్య గాని ఎవరో చంపాలి అనుకున్నారా ఎవరు అంత ధైర్యం ఎవరు చేశారు అని పల్లవి అంటుంది.
అదే గనక నిజమైతే వాళ్ళు ఎవరో తెలియాలి ముక్కలు ముక్కలు నరికేస్తాను అని కమల్ అంటాడు. అది విన్న పల్లవి షాక్ అవుతుంది. అయినా దేవుడిగారి లాంటి మామయ్యని ఎవరు చంపాలనుకుంటారు అని పల్లవి అంటుంది.. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒకతను వచ్చి ఫామ్ వస్తుంది కేర్ టేకర్ అని చెప్తాడు. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ దొరికాయి అని చెప్పడంతో అందరూ ఏంటా డాక్యుమెంట్స్ అని అనుకుంటారు.. అయితే ముందుగా అక్షయ డాక్యుమెంట్స్ ని చూసి షాక్ అవుతాడు.. ఆ తర్వాత శ్రీకర్ కూడా డాక్యుమెంట్స్ ని చూసి షాక్ అవుతాడు. శ్రియ అందులో ఏముందో చూడాలని అనుకుంటుంది.. అయితే ఆ పేపర్లను తీసుకొని చూసి షాక్ అవుతుంది.
అందులో ఏం రాసింది రా ఏంట్రా పేపర్లు చూసిన వాళ్ళందరూ అలా షాక్ అవుతున్నారు ఏంట్రా అని భానుమతి అడుగుతుంది. అప్పుడు శ్రియా ఇందులో 80% ఆస్తిని అవని పేరు మీద రాసినట్లు మామయ్య సంతకాలు చేశాడు అని చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. పల్లవి తన ప్లాన్ వర్కౌట్ అయింది అని అనుకుంటుంది.. ఆ పేపర్లను తీసుకొని కావాలని కొత్త డ్రామాలు మొదలు పెడుతుంది. మావయ్య గారు నీ పేరు మీద ఆస్తిని రాయాలి అని అనుకున్నాడు కాబట్టే నువ్వు ఆయనని చంపాలని అనుకున్నావా అని రివర్స్ డ్రామా మొదలు పెడుతుంది..
Also Read :శృతి, మీనాను సత్యం షాక్.. రోహిణి గురించి నిజం తెలుస్తుందా..? ప్రభావతికి అనుమానం..
ఇక అందరూ కూడా పల్లవి చెప్పింది నిజమే అనుకొని అవనిని తిడతారు.. అవని నేను నా తండ్రి గురించి మామయ్యతో మాట్లాడిన విషయాన్ని ఈయనతో చెప్పకుండా తప్పు చేశాను అని అనుకుంటుంది. అక్షయ్ దగ్గరికి వెళ్లి నేను మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది. అయితే నేను ఇప్పుడు నువ్వు ఏం నిజం చెప్పాలనుకున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం మీకు రెండు నిజాల గురించి చెప్పాలనుకుంటున్నాను. నాన్నని చంపాలనుకునేది ఎవరు? అలాగే ఆ డాక్యుమెంట్స్ ఒరిజినలా కాదా అన్నది తెలుసుకోవాలి అని అంటాడు.. ఇది ఎలాగైనా సరే అవి చెప్పి అసలు నిజాలని కనిపెట్టాలని అక్షయ్ అనుకుంటాడు. అభి కి ఫోన్ చేసి అక్షయ్ రమ్మని పిలుస్తాడు. కామెంట్స్ గురించి చెప్పగానే వాటి గురించి నేను కనుక్కుంటాను అని అభి అంటాడు.. ఆ తర్వాత శ్రియ భానుమతి ఇద్దరు కూడా అవనీని దారుణంగా తిడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.