Intinti Ramayanam Today Episode January 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. కోటిలింగం శ్రియా అక్క తిన్నదా మిగిలిన అన్నం ఏది అని అనగానే భానుమతి అతని కొడుతుంది.. అది ఎంగిలి చేసిన అన్నని నాకు తినిపిస్తావా దొంగ సచ్చినోడా అంటూ భానుమతి కోటిలింగం నీ కొడుతూనే ఉంటుంది. కోటిలింగం మాత్రం నాకు మీరు చాలా బాగా మసాజ్ చేశారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భానుమతి ఎంగిలి అన్నన్ని నేను తిన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత పల్లవి అవనిని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటుంది. పల్లవి తన తండ్రి తనకు దూరం చేసిన అవనిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని అనుకుంటుంది.
ఉదయం లేవగానే పల్లవి శ్రీయాలు ఇద్దరూ కడుపుతో ఉన్నారని అవని వాళ్లకు కావాల్సిన అన్నీ చేసిపెడుతూ ఉంటుంది. శ్రేయ ఆమ్లెట్ అడగ్గానే అవని చేసుకుని తీసుకొస్తుంది. అలాగే పల్లవి కూడా తనకి కాఫీ తాగాలనిపిస్తుంది అని అంటుంది. కాఫీ చేయగానే ఇది నాకు నచ్చలేదు నాకు ఇంకేదైనా కావాలి అని అడుగుతుంది. ఆ కాఫీ ని తాగిన కమల్ కాఫీ బాగానే ఉంది కదా మరి నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని అంటాడు. కాఫీ బాగానే ఉంది కానీ నాకు తాగాలనిపించలేదు అని పల్లవి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్ర పొంగలి చెయ్యడానికి వంట గదిలోకి వెళ్లిన అవని వెనకలే మీనాక్షి కూడా వెళ్తుంది. నేను ఒక మాట అంటాను ఏమీ అనుకోవు కదా అని మీనాక్షి అడుగుతుంది. శ్రేయ కి తల్లి అయిన తర్వాత వాంతులు వేవిల్లు అన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ పల్లవికి మాత్రం అలాంటి లక్షణాలు ఏవి కనిపించలేదు అని మీనాక్షి అంటుంది.. ఆ మాట వినగానే అవని నిజంగానే పల్లవికి అలాంటి లక్షణాలు ఏవి లేవు. నాకు కూడా అనుమానంగా ఉంది అని అనుకుంటుంది. పల్లవికి అలాంటి లక్షణాలు లేవు కానీ పల్లవి కడుపు విషయంలో అబద్ధం చెప్తుందని నేను అనుకోలేదు అమ్మ అని మీనాక్షితో అవని అంటుంది. ఇలాంటి పెద్ద అబద్ధం ఎందుకు ఆడుతుంది అని ఉంటుంది.
చక్కెర పొంగల్ని తీసుకొని బయటికి వచ్చిన అవనీ శ్రియకు పల్లవికి ఒక కప్పుల లో పెట్టి ఇస్తుంది. అయితే అది తినిపిస్తున్న కమల్ తో పల్లవి వాసన వస్తుంది అని అంటుంది. ఏదో నాకు మందు వాసన వస్తుంది బావ ఏదోలా ఉంది అని అనగానే కమల్ కూడా దాన్ని వాసన చూస్తాడు. అవును వదిన ఏదో వాసన వస్తుంది అని అనగానే స్ట్రేగా కూడా అవును నిజంగానే ఏదో మందు వాసన వస్తుంది చండాలంగా ఉంది అని అంటుంది. ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది.. పార్వతి దాన్ని తీసుకొని ఇలా ఇవ్వు ఎదో వాసన వస్తుంది నేను చూస్తాను అని అంటుంది.. పార్వతి కూడా అదే వాసన రావడంతో ఇక పల్లవి రెచ్చిపోతుంది..
నువ్వు మంచి దానివి అనుకున్నాను అక్క నాకు కడుపు ఒకటి ఎందుకు ఇలాంటి మందును కలిపి నాకు ఇస్తావా? నేనంటే నీకు ఎందుకు అంత బాగా అని డ్రామా ని మొదలు పెడుతుంది.. నేనేం చేశానని నువ్వు నా కడుపు ఎందుకు ఇలా మందు కల్పించావు అది నులిపురుగులను చంపడానికి వాడే ముందు అని అత్తయ్య అంటున్నారు కదా.. నువ్వు ఇలా నా కడుపు ఒకటి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నావా అని పల్లవి అవని పై కావాలని నిందలు వేస్తుంది. అవని మాత్రం నువ్వు దారుణమైన నిందలు వేస్తున్నావు. కడుపులు పోగొట్టే దానిలాగా నేను కనిపిస్తున్నానా ఏంటి అని అవని అంటుంది. మీనాక్షి కూడా నేను అక్కడే ఉన్నానమ్మ ఏమి కలపలేదు అని అన్నగాని పార్వతి తల్లి కూతురు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నువ్వు ఇంకొకసారి వంటగదిలోకి వెళ్తే ఊరుకోను అని మీనాక్షికి వార్నింగ్ ఇస్తుంది..
Also Read : రూటు మార్చిన మీనా.. నిజం తెలుసుకున్న బాలు.. ప్రభావతికి షాకిచ్చిన శృతి..
పల్లవి తన ప్లాన్ సక్సెస్ అయిందని చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక తర్వాత మీనాక్షి చక్రధర్ ని కలవడానికి జైలుకు వెళుతుంది.. ఇక్కడ చక్రధర్ మీనాక్షిని చూసి షాక్ అవుతాడు. నీలాంటి వాన్ని నమ్మి నేను మోసపోయాను ఇప్పటికీ నువ్వు మారవా అని అంటుంది. కానీ చక్రధర్ మాత్రం నేను బయటకు వస్తే నిన్ను నీ అల్లుడిని కూతుర్ని అసలు వదలను అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. కమల్ అలా వెళ్ళగానే పల్లవి మాత్రం అక్కడున్న సౌండ్ బాక్స్ పెట్టుకుని తీన్మార్ స్టెప్పులేస్తుంది.. కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నెమ్మదిగా నడవాలని అనుకుంటారు కానీ పల్లవి మాత్రం ఇలా పాటకు స్టెప్పులేస్తుంది అని అవని అనుమాన పడుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..