Medaram: మేడారంలో గద్దెలు-ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్రెడ్డి సోమవారం పునఃప్రారంభించారు.ఆ తర్వాత కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
మేడారంలో రెండో రోజు సీఎం రేవంత్రెడ్డి
మేడారం టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండోరోజు సోమవారం ఉదయం వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ఆదివాసీలు. సుమారు 101 కోట్ల రూపాయలతో ఆధునీకరించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం, నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి.
ఆ తర్వాత వన దేవతల గద్దెల వద్ద తొలి మొక్కు సమర్పించారు. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి పూజలు చేశారు. సమ్మక్క తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వనదేవతలకు మొక్కులు పూర్తయిన తర్వాత గద్దెల ప్రాంగణంలో సీఎం రేవంత్ కుటుంబ సభ్యులకు, మంత్రులకు దేవతల ప్రసాదం, చీరె సారె బహుకరించారు మంత్రి సీతక్క.
వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభించిన సీఎం దంపతులు
సీఎం రేవంత్రెడ్డి, తన మనవడు రేయాన్ష్తో కలిసి తులాభారం వేసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని వన దేవతలకు సమర్పించారు. భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
కుంభమేళా తరహాలో మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటన పూర్తి అయ్యింది. దీంతో అక్కడి నుంచి
హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ వెళ్లనున్నారు సీఎం రేవంత్రెడ్డి. పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా సీఎం టూర్ కొనసాగుతోంది.
ALSO READ: దేశంలో తొలి ముఖ్యమంత్రిగా రికార్డు.. హార్వర్డ్ స్టూడెంట్గా సీఎం రేవంత్రెడ్డి
సమ్మక్క దేవత గద్దె వద్ద కుటుంబ సమేతంగా సీఎం పూజలు. సమ్మక్క తల్లికి పట్టు వస్త్రాలు సమర్పణ https://t.co/bm2GqOoZLG pic.twitter.com/Dla3KAw4Z5
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2026