Intinti Ramayanam Today Episode june 16th :మీనాక్షి ఆరోగ్యం బాగోలేదు ఆమె పరిస్థితి దారుణంగా ఉంది అందుకే హాస్పిటల్స్ తీసుకుని వచ్చామని జైలు నుంచి ఫోన్ రాగానే అవని మా అమ్మకి ఆరోగ్యం విషం ఇచ్చిందంట అండి నేను వెళ్తాను అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అవని వాళ్ళ అమ్మ చచ్చిపోతుందేమో అని చాలా లో లోపల సంతోష పడిపోతూ ఉంటుంది పల్లవి.. ఆ తర్వాత అవని హాస్పిటల్ కి వెళ్తుంది.. అక్కడ మీనాక్షి పరిస్థితిని చూసి బాధపడిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంది అవని. డాక్టర్ వచ్చి మీనాక్షి పరిస్థితి విషమంగా ఉంది ఆమె బతకడం కష్టమని చెప్పగానే అవని ఒక్కసారిగా గొప్ప కోల్పోతుంది.
తల్లి కార్యక్రమాన్ని పూర్తిచేసుకుని పల్లవి మీనాక్షి పరిస్థితి దారుణంగా ఉంది అని సంతోషంగా ఉంటుంది.. చక్రధర్ఆ కార్యక్రమం పూర్తయిన వెంటనే హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ మీనాక్షి పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని చాలా బాధపడిపోతాడు.. ఆమెకు బ్లడ్ అర్జెంట్గా కావాలి అని అనగానే మాది ఎవరిది బ్లడ్ గ్రూప్ కాదు మేము బయట వెళ్లి ట్రై చేస్తాము అని అక్షయ్ కమల్ బయటికి వెళ్తారు.. అయితే ఎంత వెతికినా కూడా ఆ బ్లడ్ గ్రూప్ దొరకకపోవడంతో చక్రధర్ పల్లవిది అదే బ్లడ్ గ్రూప్ కదా ఇస్తుందా అని అడుగుతాడు.. భరత్ ఫోన్ చేసి విషయం చెప్పగానే పల్లవి హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇస్తుంది.. బ్లడ్ ఇచ్చినందుకు అందరూ పల్లవిని పొగిడేస్తూ ఉంటారు..
బ్లడ్ ఇచ్చినందుకు పల్లవి నీరసంగా ఉంటుందని కమల్ జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు.. అయితే పల్లవి మీనాక్షి చచ్చిపోయింది అని కలగంటుంది.. మీనాక్షి చచ్చిపోనా నాకు కావాలి అందుకే నేను ఇలా చేశాను అని తను చేసిన పని గురించి ఫ్లాష్ బ్యాగ్లో చూపిస్తారు.. కాసేపట్లోనే మీనాక్షి చచ్చిపోతుంది అని చాలా సంతోషంగా ఉంటుంది.. కానీ డాక్టర్ మాత్రం ఆపరేషన్ సక్సెస్ అయింది మీనాక్షి సేఫ్ అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇది ఎలా సాధ్యం నేను బ్లడ్ మార్చాను కదా అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది.. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది మీనాక్షి బతకడానికి వీల్లేదు అని పల్లవి షాక్ లో ఉండిపోతుంది.
కేసు వాపస్ తీసుకుంటే ఇంకా మంచిది కదా అత్తయ్యని ప్రాణాలతో బతికించావు అని కమల్ అడుగుతాడు. ఆమె ప్రాణాలతో పోరాడుతుంది అని బ్లడ్ ఇవ్వడానికి వచ్చాను. కానీ కేసులు మాత్రం తీసుకోను నా తల్లి చావుకి కారణం మీనాక్షి కాబట్టి నేను ఆమెను అస్సలు విడిచిపెట్టను అని పల్లవి వార్నింగ్ ఇస్తుంది.. అయితే సాక్షులని మాయ చేసావు కదా ఎలాగైనా సరే వాళ్ళని తీసుకుని వచ్చి కేసు గెలిచేలా చేస్తాము అని అక్షయ్ కమల్ ఇద్దరు కూడా అంటారు.. పల్లవి మాత్రం మీనాక్షి ఎలా బతికింది అని తెలుసుకోవాలని అనుకుంటుంది..
నేను బ్లడ్ మార్చాను కదా మరి ఆ మీనాక్షి ఎలా బతికింది అని పల్లవి ఆలోచిస్తూ బయటికి వస్తుంది.. నేను బ్లడ్ మార్చిన తర్వాత కూడా మీనాక్షి బతకడం ఇంపాజిబుల్ కానీ ఎలా బతికింది అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. వెనకాల పల్లవి అని గట్టిగా ఒక మాట వినిపించడంతో వెనక్కి తెలియజేస్తుంది.. అవని మా అమ్మ ఎలా బతికింది అని నువ్వు ఆలోచిస్తున్నావు కదా నువ్వు మా అమ్మని బతికించడానికి రాలేదు చంపేయడానికి వచ్చావని నాకు అర్థమైంది. అందుకే నిన్ను ఎక్కడ మిస్ చేయకుండా ఒక కంట కనిపెట్టాను.. నువ్వు బ్లడ్ మార్చిన సంగతి నాకు అర్థం అయిపోయింది. అందుకే నిన్ను ఫాలో అవుతూ లోపలికి కూడా వచ్చాను నువ్వు చేసిన పని నాకు అర్థం అయిపోయింది.. నీ బుద్ధి ఇంకా ఎప్పటికీ మారదా నా కన్నతల్లిని బయటకు తీసుకుని వచ్చి చూపిస్తారు అని పల్లవి తో అవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా పల్లవికి మీనాక్షి తన తల్లి అని తెలిస్తే మాత్రం ఆ తర్వాత సీన్లు వేరేలా ఉంటాయని తెలుస్తుంది..
Also Read :‘పొదరిల్లు’ కేశవ లవ్ స్టోరీలో ట్విస్టులు.. ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతంటే..?