Intinti Ramayanam Today Episode September 20th : అవనికి పల్లవి పై అనుమానం వస్తుంది.. ఇవన్నీ సడన్గా జరుగుతున్నయంటే దానికి కారణం ఎవరు ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజంగానే పల్లవి మారిపోయిందా లేదంటే నటిస్తుందా అని ఆలోచిస్తుంది. పల్లవి నిజంగానే మారిపోయిందా ఇంట్లో ఇవన్నీ జరగడానికి కారణం పల్లవి నేను అనే అనుమానం అవనికి వస్తుంది. నిజంగానే అవని పల్లవి పై అనుమానం ఉన్నట్లే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే అవని పల్లవి గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది. కమల్ చేసిన పనికి పల్లవికి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటుంది. పల్లవి మాత్రం తన ప్లాను చెడిపోయింది అవని తెలివిగా ప్రవర్తించి ఏదేదో చేసేసింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు తప్పించుకున్న ఇక మీదట తప్పించుకునే అవకాశాన్ని నేను ఇవ్వను అని అంటుంది అవని..
ఇక కమల్ని ఎంతగా ఓదార్చినా కూడా రాత్రంతా తన తండ్రి లేడు అని బాధ పడిపోతూనే ఉంటాడు. దాంతో ఇద్దరు అన్నయ్యలు కూడా ఎలాగైనా సరే కమల్ని కాపాడాలి అని అనుకుంటారు.. ఇక పల్లవి ప్లాన్ చేసిన కిడ్నాపర్స్ ఎలాగైనా సరే.. పల్లవి వాళ్ళ ఇంట్లో ఉన్న బాబుని కిడ్నాప్ చేసి పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. పల్లవిని ఇరికించాలి.. అప్పుడే మనం చాలా సంతోషంగా ఉంటాం.. లేదంటే మనల్ని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుందా అని వాళ్ళు ప్లాన్ చేస్తారు.. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అనేది సస్పెన్స్ గా మారింది..
పల్లవి ఎలాగైనా సరే పార్వతికి నిజం చెప్పాలి అని అనుకుంటుంది. అత్తయ్యకి నిజం తెలిస్తే ఆవిడ చచ్చిపోతుంది నాకు కావాల్సింది అదే అని అనుకుంటుంది అయితే ఇంట్లో అవని ఉందా లేదా చూసి మరి చెప్పాలి అని పల్లవి అనుకుంటుంది. అయితే భానుమతి దగ్గరికి వెళ్లిన పల్లవి ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ చనిపోయాడు అన్న నిజాన్ని వారికి తెలియజేయాలి అని అనుకుంటుంది. మీరు అత్తయ్య గారు మాట్లాడారు కదా మరి ఒకసారి వీడియో కాల్ లో చూస్తే మీకు కూడా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది కదా అని అనుకుంటుంది. ఆ మాట వినగానే భానుమతి నువ్వు చెప్పింది కూడా నిజమేనే అవని రాదని వీడియో కాల్ చేయమని చెప్పాలి నా కొడుకుని చూడాలని నాకు కూడా ఉంటుంది కదా అని భానుమతిని రెచ్చగొట్టేలా పల్లవి ప్లాన్ చేస్తుంది అయితే అవని అక్క ఎక్కడికి వెళ్ళింది అని పల్లవి అడుగుతుంది.. శ్రియ అవని ఇద్దరూ మార్కెట్ కు వెళ్లారు అని భానుమతి చెప్తుంది.
అవని వాళ్ళు మార్కెట్ కి వెళ్లి అన్నీ కొనుక్కొని వస్తుండగా పల్లవికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయిన షాక్ ఇవ్వాలి అని పిల్లల్ని ఎత్తుకెళ్లి కిడ్నాపర్స్ శ్రేయ బాబుని ఎత్తుకెళ్లాలి అని ప్లాన్ చేస్తారు.. మార్కెట్లో వాళ్ళని ఫాలో అయ్యి మొత్తానికి బాబుని ఎత్తుకొని వెళ్లి పరిగెడుతూ ఉంటారు వాళ్ళ వెనకాలే అవని శ్రియ కూడా పరిగెడుతూ ఉంటారు. వీళ్ళిద్దరిని చూసినా పల్లవి వీళ్లు గనక దొరికిపోతే నా గురించి నిజం తెలిసిపోతుంది. వీళ్ళు అవనికి చిక్కకుండా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు దొరకకుండా బాబుని నేనే కాపాడాలి అని అనుకుంటుంది పల్లవి. కానీ తనకి మాత్రం కిడ్నాపర్స్ వరుసగా షాకులు మీద షాకులు ఇస్తూనే ఉంటారు. అవని ఆ కిడ్నాపర్స్ ని వెంబడించి వెంటాడి మరి పట్టుకుంటుంది.. బాబుని కిడ్నాప్ చేయమని నీకు ఎవరు చెప్పారు అని అవని వాళ్ళని అడుగుతుంది.
అసలు బాబుని కిడ్నాప్ చేయాలన్న ఆలోచన మీకు ఎవరిచ్చారు అని పల్లవి గురించి వాళ్ళు నిజం చెప్పేలా అవనీ వాళ్ళని తాడుతో కట్టి పోలీసులకు అప్పగించాలి అని అనుకుంటుంది ఇక అనుకున్నట్లుగానే అవని ఆ కిడ్నాపర్స్ ని తాళ్లతో కట్టి వాళ్ళ దగ్గర నుంచి బాబుని తీసుకుంటుంది. బాబు దొరకగానే అసలు మీకు ఈ పని చేయమని ఎవరు చెప్పారు ఎందుకు మీరు పదే పదే మా బాబు నీకు ఎగ్జామ్ చూస్తున్నారు అని అవని అడిగినా కూడా వాళ్ళు చెప్పరు ఇక పోలీసులు అక్కడికి రాగానే పల్లవి కచ్చితంగా నేను దొరికిపోతాను. నేను మారలేదు అన్న విషయం వాళ్లకి తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలి అని కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో పల్లవిని ఆ కిడ్నాప్ ఇరికిస్తారా లేదా ఇంకేదైనా మ్యాజిక్ చేస్తారా అన్నది చూడాలి..
Also Read :Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..