Karthika Deepam Doctor Babu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు సీరియల్స్ అంటే బోరింగ్ అనుకునేవారు. కానీ ఈ మధ్య సినిమాలను మించిన స్టోరీతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దాంతో వీటికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ సరికొత్త కథలతో సీరియల్స్ ను అందిస్తుంది.. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటున్నాయి.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో కార్తీకదీపం ఒకటి. గతంలో వచ్చిన ఈ సీరియల్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో ఆ సీరియల్ కి సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రస్తుతం ప్రసారమవుతుంది.. ఇందులో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ పరిటాల గురించి అందరికీ తెలుసు.. నటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ప్రస్తుతం పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఆయన గురించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు బుల్లితెరపై నటుడిగా ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిరూపమ్ పరిటాల. ఈయన తన తండ్రి కూడా మంచి నటుడు అన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ డాక్టర్ బాబు గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జరగని ముద్ర వేసుకున్నాడు. ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ సక్సెస్ అవుతున్నాడు. ఈమధ్య తన భార్యతో కలిసి ఓ బట్టల వ్యాపారం లోకి అడుగుపెట్టారు. ఇప్పుడు స్టార్ మా లో ప్రసారమవుతున్న ఒక సీరియల్ ని నిర్మిస్తున్నారు. బుల్లితెర పై నటుడుగా ఉన్న ఈయన తన క్రేజ్ తో నిర్మాతగా కూడా మారారు.. తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ ను ఈయన నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read: రెమ్యూనరేషన్ పెంచమని అడిగితే ఏం జరుగుతుందో తెలుసా..? పచ్చి నిజాలు బయటపెట్టిన జీవన్..
కార్తీక దీపం సీరియల్ కు ముందుగా చంద్రముఖి తో పాటుగా మరికొన్ని సీరియల్స్ చేసి నటుడు సక్సెస్ టాక్ ను అందుకున్నాడు.. ఆ తర్వాత కొన్ని సీరియల్స్లలో నటించారు. అంతే కాదు మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే కార్తీకదీపం లైఫ్ని పూర్తిగా మార్చేసింది. డాక్టర్ బాబుగా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దాంతో పాటుగా ఆస్తులను కూడా బాగానే వెనకేసుకొస్తున్నాడు. ప్రస్తుతం నిరూపమ్ ఆస్తుల విషయానికొస్తే.. 80 లక్షల విలువ చేసే ఖరీదైన ఇల్లు హైదరాబాద్ లో ఉంది. అంతేకాదు ఈయనకు వైజాగ్ లో ఎన్నో ప్రాపర్టీలు ఉన్నాయి. అందులో ఐదు కోట్ల విలువ గల స్థలాలు ఉన్నాయి.. అలాగే ఇప్పుడు బట్టల వ్యాపారాలు ఉన్నాయి. వీటితో పాటుగా ఇప్పుడు నిర్మాతగా మారి పొదరిల్లు సీరియల్ ను నిర్మించారు. ఈ సీరియల్ నిన్నటి నుంచి ప్రసారం అవుతుంది.. ఈ స్టోరీ డిఫరెంట్ గా ఉంటుందని ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..