Podarillu Serial : బుల్లితెర ప్రేక్షకులకు పొదరులు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రారంభమైన కేవలం కొద్ది నెలల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ముఖ్యంగా ఈ సీరియల్ హీరో హీరోయిన్లు అయినా చక్రి మహా లవ్ స్టోరీ అనేది కాస్త ఆసక్తిగా ఆకట్టుకుంటుంది. మాధవ్ అలాగే గాయత్రిల ఎమోషనల్ లవ్ స్టోరీ సీరియల్ కి హైలైట్ గా నిలిచింది.. నిన్నటి వరకు అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్లతో ప్రేక్షకులను ఏడ్పించేశారు.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ బాగా పెరిగింది. ఇదిలా ఉండగా.. ఈ సీరియల్ లోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. మరి ఈ సీరియల్ లో నిజంగానే కొత్త హీరోయిన్లు వచ్చారా? మహాలక్ష్మిని తీసేసారా అన్న డౌట్ కూడా ఆడియన్స్ కి కలుగుతుంది.. అసలు నిజం ఏంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…
ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటికి దాదాపు మూడు నాలుగు సీరియల్స్ కొత్తవి ప్రారంభమయ్యాయి.. ఇప్పుడు మరో సీరియల్ కూడా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆ సీరియల్ పేరే గోదావరి 2. అయితే సీరియల్ ప్రమోషన్స్ కోసం స్టార్ మా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. అదేవిధంగా ఈ సీరియల్ ప్రమోషన్స్ కోసం పొదరిల్లు సీరియల్ ని వాడుకున్నారు.. ఆ వీడియోని ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఏముందంటే… చక్రి తన కారులో గోదావరి సీరియల్ లోని హీరోయిన్ అక్కచెల్లెళ్లని ఎక్కించుకుంటాడు.. అయితే వాళ్లు తమ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగా అది వింటాడు చక్రి.. ఇదేదో బాగుంది వీళ్ళని మా అన్నదమ్ములకు సెట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని ఫిక్స్ అయిపోతాడు.. ఇక వాళ్లకి తన వాళ్లని పరిచయం చేయాలని అనుకుంటాడు. ఇదే అసలు ట్విస్ట్. చక్రీకి షాక్ ఇచ్చినా ఆ నలుగురు అమ్మాయిలు మాట్లాడడంతో వీడియో ఎండ్ అవుతుంది. గోదావరి సీరియల్ గురించి వాళ్ళు చెబుతారు.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సీరియల్ ప్రమోషన్స్ ఉండడంతో ప్రేక్షకులు ఎప్పుడు సీరియల్ చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సీరియల్ పొదిరిల్లి సీరియల్ కు గట్టి పోటీని ఇస్తుందేమో చూద్దాం..
Also Read : ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు ఇవే..
ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. చక్రి కుటుంబం అలాగే మహా కుటుంబం ఇద్దరూ ఒకే రిసార్ట్ లో కలుసుకుంటారు. తండ్రి మీద ప్రేమతో కూతురు పలకరించడానికి వెళ్తుంది.. కూతురు కనిపించినంత వరకు ఆ తండ్రి తన కూతురు గురించి ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాడు.. కానీ ఒక్కసారిగా కూతురు కల్లేదుటకు రావడంతో నీకు ఎవరు నాన్న ఇక్కడ లేరు అని లోపలికి వెళ్ళిపోతాడు.. తన తండ్రి అలా మాట్లాడడంతో మహాలక్ష్మి బాధపడుతుంది.. అయితే ఆ రిసార్ట్ నుంచి ఎలాగైనా సరే బయటికి వెళ్లిపోవాలని మాధవ్ అనుకుంటాడు. కానీ మిగిలిన వాళ్ళు మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాము వాళ్ల కోసం రాలేదు కదా అని అక్కడే ఉండాలని అనుకుంటారు. ఇవాళ ఎపిసోడ్ మాత్రం ఇరు కుటుంబాల మధ్య గట్టి పోటీ ఏర్పడుతుంది. మరి ఆ పోటీలో చక్రి కుటుంబం విన్నర్గా నిలుస్తుందా..? లేదంటే మహాలక్ష్మి కుటుంబం విన్నర్ గా నిలుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.. ఏం తెలియాలంటే ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే…