Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి ఇంటికి రావడంతో ఆరు కోపంగా గట్టిగా మను అని పిలుస్తుంది. మనోహరి భయంతో ఆగిపోతుంది. దగ్గరకు వెళ్లిన ఆరు ఎంత నీచానికి దిగజారావు మను. మిస్సమ్మనే చంపాలనుకుంటావా..? మిస్సమ్మ నా చెల్లి మను. మిస్సమ్మ జోలికి వస్తే నిన్ను చంపేస్తాను మను అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఏంటే దాన్ని చంపాలని చూస్తున్నందుకు నీకు బాగా కోపం వచ్చినట్టు ఉంది. అయినా నిన్ను చంపినందుకు నన్ను తిట్టు నేను పడతాను.
దాన్ని చంపితే నీకేంటి..? అది నీ అక్కా నీ చెల్లా..అమర్ను పెళ్లి చేసుకుందని నీ చెళ్లిలా ఫీల్ అవుతున్నావా..? ఏంటి.. నువ్వు అనాథగా పుట్టావు అనాథగానే చచ్చావు. అనాథగానే మిగిలిపోతావు. అది మిస్ అయిపోయిందని తెగ ఆనంద పడిపోతున్నట్లున్నావు. ఆ ఆనందం నీకు ఎక్కువ సేపు ఉంచనీయనే.. దాన్ని చంపడానికి మరెవరి మీదో ఆధారపడటం లేదు. దాన్ని చంపడానికి ఈసారి నేనే రంగంలోకి దిగుతాను. దాన్ని చంపేసి.. అమర్ను పెళ్లి చేసుకుంటాను. అది నువ్వు చూస్తావు సిద్దంగా ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది.
శివరాం టాబ్లెట్స్ వేసుకోకుండా ఆలోచిస్తుంటే నిర్మల వచ్చి ఏవండి ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. అమర్ గురించి, మిస్సమ్మ గురించి, పిల్లల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తాడు శివరాం. ఇప్పుడు ఏం అయిందండి అందరూ క్షేమంగానే ఉన్నారు కదా..? అని నిర్మల అడగ్గానే ఇప్పుడు ఉన్నారు కానీ నాకెందుకో ప్రమాదం వాళ్ల వెంటే తిరగుతుంది అనిపిస్తుంది. అరుంధతి చావు దగ్గర నుంచి ఇంట్లో ప్రతిసారి ఎవరికో ఒకరికి ప్రమాదం జరుగుతూనే ఉంది. అంటూ శివరాం భయపడుతుంటాడు. దీంతో నిర్మల మీరు అనవసరంగా భయపడుతున్నారు అండి అంటుంది. కానీ అదే ప్రమాదం మళ్లీ ఎదురైతే ప్రతిసారి అదృష్టం మనవైపే ఉంటుందని అనుకోలేం అంటాడు. అయితే ఒకసారి స్వామిజీని పిలిపించి ఏవైనా దోషాలు ఉన్నాయేమో తెలుసుకుందాం అని నిర్మల చెప్తుంది.
అమర్ బాల్కనీలో నిలబడి ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. కింద గార్డెన్లో నిలబడి ఆరు చూస్తుంది. ఇంతలో రాథోడ్, మిస్సమ్మ పేపర్ తీసుకుని అమర్ దగ్గరకు వస్తారు. మిస్సమ్మను చూసిన ఆరు చాటుకు వెళ్లి దాక్కుంటుంది. అమర్ మాత్రం రాత్రి జరిగిన కిస్ సీన్ గుర్తు చేసుకుంటాడు. కనబడగానే కస్సు, బుస్సు అనుకునే ఇద్దరు ఇలా సైడు అయిపోయారేంటి అంటే ఇద్దరి మధ్య కెమిస్ర్టీ మొదలైందా..? అని మనసులో అనుకుంటాడు. ఇంతలో మిస్సమ్మ ఏవండి డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమంటే ఇలా ఎక్సర్సైజ్ చేస్తున్నారేంటి..? అని అడుగుతుంది. డాక్టర్ గారు హ్యాండ్ ఎక్సర్ సైజ్ చేయమన్నారు అని చెప్తాడు.
బాగా చెప్పావు అమర్ అనుకుంటూ మనోహరి వస్తుంది. ఇవన్నీ మిస్సమ్మకు ఏం తెలుసు పప్పులో ఉప్పు వేయడం కూరలో కారం వేయడం లాంటివి అయితే బాగా తెలుస్తుంది అంటూ ఇందాక తెలిసిన డాక్టర్తో మాట్లాడాను అమర్ నీ గురించి చెప్పాను. తను కొన్ని ఎక్సర్ సైజులు చెప్పారు అంటూ వెళ్లి అమర్ను పట్టుకుని ఎక్సర్ సైజ్ చేయిస్తుంది. మిస్సమ్మ కోపంగా బాగా ఓవర్ చేస్తుంది రాథోడ్ అంటూ తిడుతుంది. నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే ఆవిడ ఇలాగే ఓవర్ చేస్తూ సార్ను ఎగేసుకుని పోతుంది వెళ్లు మిస్సమ్మ నువ్వు వెళ్లి విజృంభించు అని రాథోడ్ చెప్పగానే మిస్సమ్మ కోపంగా మనోహరి గారు అంటూ పిలవడంతో అమర్, మనోహరి ఉలిక్కిపడతారు.
నీకు వచ్చింది చేయడం కాదు.. ఆయనకు నొప్పి రాకుండా చూడాలి అని అమర్ దగ్గరకు వెళ్లి ఎక్సర్ సైజ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను అని మిస్సమ్మ రొమాంటిక్గా ఎక్సర్ సైజ్ చేయిస్తుంది. దీంతో రాథోడ్ నవ్వుతూ ఏంటి మేడం ఎక్కడో ఏదో కాలినట్టు అనిపిస్తుంది అని మనోహరిని అడగ్గానే మనోహరి రాథోడ్ను తిడుతుంది. ఇంతలో రాథోడ్ సార్ను హాస్పిటల్కు తీసుకెళ్లాలి అని చెప్పగానే సరే వెళ్దాం పదండి అని మిస్సమ్మ చెప్పగానే అమర్ లోపలికి వెళ్లిపోతాడు.
కింద నుంచి అంతా గమనించిన ఆరు కోపంగా గార్డెన్లోకి వెళ్లి గుప్త ఎక్కడ అని చూస్తుంది. ఇంతలో గుప్త వస్తాడు. ఆరును కోపంగా తిడతాడు. తన మాటలతో ఆరు గుప్తను కూల్ చేయబోతుంటే.. రెండు దినములలో నువ్వే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లెదవు బాలిక అని చెప్తాడు గుప్త. నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవరు ఇక్కడి నుంచి పంపిస్తారు అని అడుగుతుంది. అంతయూ దైవేచ్చ అని గుప్త చెప్తాడు. ఇంతలో ఇంటికి స్వామిజీ వస్తాడు.
గార్డెన్లో ఆరు నిలబడి ఉండటం చూస్తాడు. ఆరును చూస్తూనే లోపలికి వెళ్తుంటాడు. ఆరు కూడా స్వామిజీకి ఎదురుగా నడుస్తుంది. ఇంతలో శివరాం, నిర్మల, రాథోడ్ ఎదురుగా వచ్చి స్వామిజీని లోపలికి తీసుకెళ్తారు. వెంటనే ఆరు కంగారుగా గుప్త గారు ఆ స్వామిజీ ఏంటి నన్ను అలా చూస్తున్నారు కొంపదీసి నేను ఆయనకు కనిపిస్తున్నానా..? అని అడుగుతుంది. ఆయనకు తెలిసింది అని గుప్త చెప్తాడు. ఆయనకు ఎలా తెలిసింది అని ఆరు అడుగుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?