Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ అనుమానంగా మనోహరి మాటలు గుర్తు చేసుకుని రాథోడ్ రాగానే పిలిచి యాదమ్మ డీటెయిల్స్ కనుక్కో అని చెప్తాడు. దీంతో అదేంటి సార్ మీరే కదా ఆవిడను అపాయింట్ చేసింది అని అడగ్గానే.. అమర్ నేను కాదు మనోహరి చెప్పింది అని అమర్ అనగానే.. ఆవిడను మనోహరి గారు తీసుకొచ్చారా..? అని రాథోడ్ భయంగా అడుగుతాడు. దీంతో అమర్ అవును ఆ యాదమ్మ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది. తన గురించి పూర్తి డీటెయిల్స్ నాకు కావాలి అని అడగ్గానే..
రాథోడ్ ఇప్పుడే కనుక్కుంటాను సార్ అని లోపలికి వెళ్తుంటే.. అమర్ అపేసి రాథోడ్ యాదమ్మను అడిగి కాదు.. తనకు తెలియకుండా కనుక్కోవాలి. మనం ఇలా ఎంక్వైరీ చేస్తున్నట్టు మనోహరికి కూడా డౌటు రాకూడదు.. అని చెప్పగానే.. అయితే కేర్ టేకర్ కంన్సల్టెన్సీ ఆఫీసుకు వెళ్లి ఎంక్వైరీ చేయాలి సార్.. యాదమ్మ చెప్పింది కదా తను అక్కడి నుంచే వచ్చానని.. అని రాథోడ్ చెప్పగానే.. సరే అక్కడికే వెళ్లి ఎంక్వైరీ చేద్దాం పద అని ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.
ఇద్దరూ కలిసి కేర్ టేకర్ ఆఫీసుకు వెళ్తారు. అమర్ బయట నిలబడితే.. రాథోడ్ లోపలికి వెళ్తాడు. అక్కడి రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి యాదమ్మ అలియాస్ చంభా వివరాలు అడగుతాడు. దీంతో రిసెప్షనిస్టు తను మంచి కేర్ టేకరే కదా కుకింగ్ హౌస్ కీపింగ్, నర్సింగ్ అన్ని పనులు చేస్తుంది. ఈ ఫీల్డ్ లో చాలా ఎక్స్ఫీరియెన్స్ ఉంది సార్ అని చెప్పగానే.. రాథోడ్ తన డాక్యుమెంట్స్ ఉంటే పంపిస్తారా…? అని అడగ్గానే. ఒక ఫైల్ తీసి రాథోడ్ కు ఇస్తుంది. ఇందులో ఆవిడ ఆవిడ ఐడీ ఫ్రూప్స్ ఎక్స్పీరియెన్స్ అన్ని వివరాలు ఉన్నాయి సార్.. సార్ ఎందుకు ఇంత డీటెయిల్ గా అడుగుతున్నారు ఆవిడ వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా..? అని అడగ్గానే.. అదేం లేదు ఊరికే తెలుసుకుందామని రాథోడ్ చెప్పి వెళ్లిపోగానే వెనకాలే వచ్చి చూస్తుంది రిసెప్షనిస్ట్..
అమర్ దగ్గరకు వెళ్లిన రాథోడ్ సార్ యాదమ్మ రికార్డ్స్ చెక్ చేశాను. అన్ని క్లియర్గా ఉన్నాయి సార్. డౌటు పడాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పగానే.. అలా అని రిలాక్స్ అవ్వకు రాథోడ్.. ఆవిడ గురించి గ్రౌండ్ లెవెల్ లో నాకు తెలియాలి. నేటివ్ ప్లేస్కు వెళ్లి చెక్ చేయాలి అని అమర్ చెప్పగానే.. ఓకే సార్ నేను వెళ్లి కనుక్కుంటాను అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దూరం నుంచి చూస్తున్న రిసెప్షనిస్ట్ ఈ విషయం వెంటనే మనోహరి మేడం కు చెప్పాలి అనుకుంటూ లోపలికి వెళ్లి మనోహరికి ఫోన్ చేస్తుంది. మేడం మీ గెస్సింగే రైట్ అయింది. యాదమ్మ గురించి ఎంక్వైరీ చేయడానికి రాథోడ్ అనే ఒక పర్సన్ వచ్చాడు అని చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. వెంటనే వాడితో ఏం చెప్పావు అని అడుగుతుంది.
దీంతో రిసెప్షనిస్ట్ మీరు చెప్పమన్నదే చెప్పాను మేడం.. యాదమ్మ పేరుతో ఫేక్ డ్యాక్యుమెంట్స్, ఎక్స్ఫీరియెన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వడం మంచిది అయింది మేడం.. వాటిని చూపించి అతన్ని నమ్మించాను. అని చెప్పగానే.. వాడు నమ్మాడా..? అని మనోహరి అడుగుతుంది. నమ్మినట్టే ఉన్నాడు మేడం అని చెప్తుంది. దీంతో మనోహరి ఎంక్వైరీకి అతను ఒక్కడే వచ్చాడా..? అని అడగ్గానే.. ఆహా లేదు మేడం ఒక మిలటరీ అతను కూడా వచ్చాడు.. కానీ ఆయన బయటే ఉన్నాడు.. అని చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. అమరేంద్ర కూడా వచ్చాడా..? అని మనసులో అనుకుంటుంది. రిసెప్షనిస్ట్ భయపడుతుంటే.. మనోహరి వార్నింగ్ ఇస్తుంది. దీంతో రిసెప్షనిస్ట్ మరింత భయపడుతుంది.
తర్వాత అమర్, మిస్సమ్మ కలిసి అమ్మవారి పూజ చేస్తుంటారు. ఇంతలో మనోహరి పైకి మిస్సమ్మ రూంలోకి వెళ్లి మిస్సమ్మ శారీ తీసుకుంటుంది. వెనకాలే వెళ్లిన ఆరు మనోహరిని చూసి షాక్ అవుతుంది. వెంటనే కిందకు వచ్చి అమర్కు చెప్తుంది. కానీ అమర్కు వినిపించదు. ఇంతలో అమర్కు ఏదో ఎవరో చెప్పినట్టు అనిపించి అమర్ పైకి రూంలోకి వెళ్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.